Crime News : స్నేహితులతో కలిసి పైశాచికంగా భార్యపై శాడిస్ట్ భర్త..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 1, 2023, 4:00 pm

Crime News : సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. వావి వరసలు లేకుండా.. మనుషులు మృగాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను చంపేసే పిల్లలు… అక్రమ సంబంధాల విషయంలో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్న వ్యక్తులు ఇలా చాలామంది ఎక్కువైపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తల్లిదండ్రులను వదిలి తన జీవితమే భర్తతో అని కాపురానికి వచ్చిన భార్యని…ఓ భర్త స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడటం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక వసంత్ పూర్ నివాసి అయిన మహిళ అతడిని మ్యాట్రిమోనీలో చూసి.. కొన్నాళ్లు మాట్లాడి పరిచయం ఏర్పరచుకుని ఆ తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించుకుని 2019లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దంపతులు హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో నివసిస్తున్నారు. పెళ్లి చేసుకున్న ప్రారంభంలో బాగానే ఉన్న భర్త ఆ తర్వాత అతనిలో మార్పులు రావడం జరిగింది. స్నేహితులతో కలిసి గంజాయి మరియు డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత భార్యని అత్యంత కిరాతకంగా హింసించేవాడు.

sadistic husband on wife with friends

sadistic husband on wife with friends

అంత మాత్రమే కాదు స్నేహితులతో కలిసి పడుకోవాలని చిత్రవాద చేసి కొట్టేవాడు. ఒక్కోసారి సిగరెట్లతో కాల్చేవాడు. ఇక ఇదే సమయంలో డ్రగ్స్ తీసుకున్న స్నేహితులు భర్త ఎదురుగానే ఆమెను లైంగికంగా వేధించేవారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి భర్త అత్యాచారానికి పాల్పడుతుండగా ఒక్కసారిగా తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసు తర్వాత ఆమెపై వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయి. కేసు విత్ డ్రా చేసుకోవాలని.. నిత్యం వేధించేవారు. దీంతో బాధిత మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp