Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది బలి… సజ్జల రామకృష్ణారెడ్డి

Advertisement
Advertisement

Sajjala Ramakrishna Reddy : ‘చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో మరో సారి అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. గతంలో గోదావరి ఫుష్కారాల్లో ముహూర్తం పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేసి అమాయకులను బలిగొన్నారు. ఇప్పడు మరోసారి ప్లాన్‌ ప్రకారం కందకూరులో ఇరుకు రోడ్డులో రోడ్‌షో నిర్వహించి తన సభకు వేల మంది వచ్చారని నిరూపించుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్ లో 8 మంది అమాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు’ అని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా కందుకూరు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన మీటింగ్ కు జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చేసుకునేందుకు

Advertisement

చంద్రబాబు ప్రయత్నం బెడిసి కొట్టింది.పబ్లిసిటీ కోసం అమాయక టీడీపీ కార్యకర్తల ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరు ఘటన ప్రమాదం కాదని ఆరోపించారు. తన అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఎన్ని డ్రామాలు అయినా ఆడతారని, ప్రజలను పొట్టన బెట్టుకోవడం చంద్రబాబుకు ఎంత వరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చితో ఎనిమిది మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పకుండా డ్రామాలా.. కందకూరులో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూడటం సిగ్గచేటని విమర్శించారు. ఇరుకు రోడ్డులో మీటింగ్ ఏర్పాటు చేసి పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా? అని అడగడం చంద్రబాబు డ్రామా రాజకీయాలకు నిదర్శనమన్నారు. కందకూరులో అనుమతి తీసుకున్న

Advertisement

Sajjala Ramakrishna Reddy ABout on Chandrababu

ప్రాంతం కంటే ముందుకెళ్లి చంద్రాబు సభ నిర్వహించారని పేర్కొన్నారు. కానీ టీడీపీ పోలీసులపైనే విమర్శలు చేస్తోందన్నారు.కందుకూరు తొక్కిసలాట, 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటనపై తప్పు ఒప్పుకుని వెంటనే ప్రజలను, టీడీపీ కార్యకర్తలను క్షమాపణలు కోరాలన్నారు. 8 మంది అమాయకులు చనిపోయినా చంద్రబాబు ముఖంలో పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ఘటనను సమర్ధించుకోవడం చూస్తుంటే చంద్రబాబు లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తోందన్నారు. తన చుట్టూ ఏది సెన్సేషన్‌ చేసుకోవాలని చంద్రబాబు నిత్యం ఆరాటపడుతుంటారని, ఆ ఆలోచన వల్లే కందకూరులో ఈ నరబలి జరిగిందని, దీనిపై క్షమాపణలు చెబితేనే చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆత్మ శాంతి లభిస్తుందన్నారు.

Advertisement

Recent Posts

Today Horoscope 14th February 2026 : నేటి రాశి ఫలాలు 14 ఫిబ్రవరి 2026 : ఈ రాశి వారు ఇంట్లోని పూజా మందిరంలో చంద్ర యంత్రాన్ని ఉంచితే డబ్బే డబ్బు

Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…

23 minutes ago

Couple Friendly Movie Review : క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…

7 hours ago

Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…

8 hours ago

Kalyan – Thanuja : కళ్యాణ్ – తనూజ మళ్ళీ ప్రేమ చిగురిస్తోంది ?? ప్రూఫ్ ఇదే !

Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…

9 hours ago

Sreeja : కాబోయే భర్త గురించి ఓపెన్ గా చెప్పేసిన దమ్ము శ్రీజ..!

Sreeja  : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…

9 hours ago

Ysrcp : వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…

10 hours ago

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

12 hours ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

13 hours ago