Siva Shankar Reddy : రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల జాబితా నుంచి అర్హులైన వారిని తొలగిస్తోందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని వైఎస్సార్ సీపీ ఖండించింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే టీడీపీ మరియు వారి ఎల్లో మీడియా అసత్య ప్రచారాలకు దిగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద సాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారిని పెన్షనర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ కు అర్హులైనవారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. ఒకవేళ ఎవర్నైనా పెన్షన్ పథకం నుంచి తొలగించాలంటే ముందుగా 15 రోజుల నోటీసు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ అని, 2019 లో అధికారంలోకి వచ్చాక పెన్షన్ల రివ్యూ ప్రక్రియ చేపట్టడం ఇది మూడోసారి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రూ.400 కోట్ల బడ్జెట్ తో 39 లక్షల మందికి పెన్షన్ అందించగా.. ఇప్పుడు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1600 కోట్ల బడ్జెట్ తో 62 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, వచ్చే నెల నుంచి లబ్దిదారులకు పెన్షన్ సాయాన్ని రూ.2,500 నుంచి రూ.2,750 కి పెంచనున్నట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్ల ఉన్న అంకిత భావం స్పష్టమవుతోందన్నారు. ప్రతినెల మొదటి రోజునే దాదాపు 90శాతం మంది లబ్దిదారులకు పెన్షన్లు చేరుతున్నాయన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వ్రుద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్, డప్పు కళాకారులు ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వంలో లబ్ది పొందుతున్నారని శివశంకర్ రెడ్డి తెలిపారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.