Smart Phones : ఒప్పో, వన్ ప్లస్, సామ్‌సంగ్, షియోమీ‌ కంపెనీలు రిలీజ్ చేసిన ప్రీమియం ఫోన్స్.. ఫీచర్స్ ఇవే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smart Phones : ఒప్పో, వన్ ప్లస్, సామ్‌సంగ్, షియోమీ‌ కంపెనీలు రిలీజ్ చేసిన ప్రీమియం ఫోన్స్.. ఫీచర్స్ ఇవే..

 Authored By mallesh | The Telugu News | Updated on :6 February 2022,7:30 pm

Smart Phones : ప్రస్తుతం ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిదే తమ పని చేయడం లేదని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో వివిధ కంపెనీలు యూజర్స్ కు అవసరయమ్యే సరి కొత్త ఫీచర్స్ వాటిలో ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ లోకి ఇంకా కొత్త ఫోన్లు తీసుకొస్తున్నాయి. అలా ఇటీవల భారతీయ మార్కెట్ లోకి ఈ ఏడాది ప్రముఖ కంపెనీలు అయిన షియోమీ, వన్ ప్లస్, ఒప్పో, సామ్ సంగ్ లు సరికొత్త ప్రీమియం ఫోన్లు లాంచ్ చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ కంపెనీలు విడుదల చేసిన ఈ ప్రీమియం ఫోన్స్ కు ఉన్న ఫీచర్స్ యూజర్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి కూడా.

ఈ క్రమంలోనే ఆ ఫీచర్స్ ఏంటి? ఆ ఫోన్ మోడల్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, షియోమీ 11టీ ప్రో, వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ, ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్స్.. వెరీ స్పెషల్ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఒప్పో రెనో 7, షియోమీ 11టీ ప్రో మొబైళ్లు ఒకే ధర ను కలిగి ఉన్నాయి. ఇకపోతే సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ప్రైస్ రూ.54,999గా ఉంది.ఒప్పో రెనో 7 ప్రో ప్రైస్ రూ.39,999 కాగా, షియోమీ 11టీ ప్రో ప్రైస్ రూ.39,999 గా ఉంది.

smart phone models in indian market released

smart phone models in indian market released

Smart Phones : ఈ ఫోన్స్‌లో ఉన్న హైలైట్ ఫీచర్స్ ఇవే..

వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ రూ. 42,999గా ఉంది. ఇందులోని డిస్ ప్లే, ప్యానెల్ అన్నీ పెద్ద స్క్రీన్ తో ఉంటాయి. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ కూడా సెపరేట్ ఫీచర్స్ కలిగి ఉంది. 6.4 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ ఇది. ఒప్పో రెనో 7 ప్రో మోడల్ 6.53 ఇంచుల సాఫ్ట్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉండగా, షియోమీ 11టీ ప్రో మోడల్.. 6.67 ఇంచుల అమోలెడ్ డాట్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇక వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ: 6.61 ఇంచుల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంది. ఈ నాలుగు ఫోన్లు కూడా వెరీ హై ఎండ్ కెమెరాలను కలిగి ఉన్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది