Chandrababu : ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుకు ఉన్నది.. సోము వీర్రాజు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుకు ఉన్నది.. సోము వీర్రాజు

 Authored By prabhas | The Telugu News | Updated on :11 March 2022,7:00 am

Chandrababu : మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో రైతులను పట్టించుకోలేదని, అలాగే పలు రంగాలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఇంకా పలు జిల్లాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ ఆయన తెలియజేశారు.

గుంటూరు జిల్లాలో జరిగిన రైతు సభలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. మిర్చి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థికపరమైన అన్యాయాలను చేశారు. ఆయన ఉద్యోగాలను అమ్ముకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.

somu veerraju fires on chandrababu naidu

somu veerraju fires on chandrababu naidu

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఆ సబ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగాలను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి మరోసారి చుక్కెదురు తప్పదంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది