పోలీసులు అంటే చాలా కఠిన హృదయులు అని చాలా మంది అంటుంటారు. అయితే, అందరూ అలా ఉండబోరని నిరూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. జిల్లాలోని రుద్రంగి మండలానికి చెందిన సింగారపుబాబు దివ్యాంగుడు అయినప్పటికీ మంచి క్రీడాకారుడు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమున్న ఇతను ప్రతీ రోజు ప్రాక్టీస్ కు వెళ్తుంటాడు. కాగా ఇటీవల సింగారపు బాబు ఇరాన్లో జరిగే దివ్యాంగుల ఆసియా కప్ సిట్టింగ్ వాలీబాల్ ఆటకు ఎంపికయ్యాడు. నవంబర్ 6 నుంచి 14 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.
అయితే, ఇందులో పాల్గొనేందుకుగాను ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది కట్టడానికి ఆర్థికంగా స్థోమత లేక సింగారపు బాబు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన ఎస్పీ శనివారం అతడిని కలిశాడు. పోలీసు శాఖ తరఫున రూ.50 వేలు సాయం చేశాడు. దాంతో దివ్యాంగ క్రీడాకారులు సింగారపుబాబు ఆనందం వ్యక్తం చేశాడు. సిట్టింగ్ వాలీబాల్ గేమ్లో విజేతగా నిలిచి పోలీసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు. ఇకపోతే పారాలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారులు సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. భారత్కు పలు పతకాలు సాధించిపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.