
malkajgiri congress mp revanth reddy
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు త్రిముఖ పోటీని తలపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. అయితే టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ను మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం తామే అని.. ఈ విషయంలో బీజేపీ తమతో పోటీ పడలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ వైపు చూస్తున్న నేతలు, బీజేపీలో కొనసాగుతున్న నేతలను తమ వైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అప్పటివరకు బీజేపీలోకి వచ్చేందుకు ముందుకొచ్చిన పలువురు నేతలు.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ వైపు చూడటం బీజేపీకి కొత్త సవాల్ను తెచ్చిపెట్టింది.ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు, తమ పార్టీలోకి రావాలనుకున్న నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.
revanth reddy
దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, కూల శ్రీశైలం గౌడ్, మూల విక్రమ్ గౌడ్ వంటి కొందరు నాయకులు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీలో కొనసాగుతున్న ఈ నాయకులు కాంగ్రెస్లోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన కమలనాథులు.. వారు అటు వైపు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. కొందరు ముఖ్యనేతలు రంగంలోకి దిగి వీరితో చర్చలు జరిపారు. వీరిలో కొందరు నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ.. తాము పార్టీ మారడం లేదనే సంకేతాలు ఇచ్చేలా చేశారు కాషాయం నేతలు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి కొత్త నేతలు రాకపోయినా.. ఇప్పటికే పార్టీలో చేరిన నాయకులు మళ్లీ వేరే పార్టీలో మారకుండా చూడాలని బీజేపీ నేతలు భావించారు. అలా జరిగితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఇబ్బందులు రావడంతో పాటు తెలంగాణలో బీజేపీ బలహీనపడుతుందనే సంకేతాలు వెళతాయని అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తారని అనుకున్న నేతలందరినీ కలిసి.. వారు బీజేపీలోనే కొనసాగేలా చేశారని సమాచారం.
inugala peddireddy may be Joine congress
ఈ రకంగా చేయడం ద్వారా తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలను ఆకర్షించకుండా చేయడంలో బీజేపీ నేతలు చాలావరకు విజయం సాధించారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ను దెబ్బకొట్టడంతో పాటు మరో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతం కాకుండా చూస్తేనే.. బీజేపీ ఇక్కడి రాజకీయాల్లో రాణించగలదని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.జూరాబాద్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం లేదా టీఆర్ఎస్కు అక్కడ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని చాటి చెప్పొచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు నేతలెవరూ ఇతర పార్టీల వైపు చూడకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న కమలనాథులు.. ఈ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో…
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
Redmi K100 Review : సాధారణంగా రెడ్మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…
This website uses cookies.