AP Govt : వెనక్కి తగ్గేది లేదు.. అని సవాల్ చేసిన వైఎస్ జగన్.. ఆ విషయంలో ఎందుకు తగ్గారు?

AP Govt : ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన మలుపు తిరిగింది. దమ్మాలపాటి శ్రీనివాస్ పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వైఎస్ జగన్ రెడ్డి Ys jagan సర్కార్ వెనక్కి తీసుకుంది. అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అమరావతిలో రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతో దమ్మాలపాటి శ్రీనివాస్ ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దమ్మాలపాటి శ్రీనివాస్ Dulapati Srinivas కూడా భాగస్వామేనని చెబుతోంది. దీనిపై ఏసీబీ విచారణ షురూ చేయగా, దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతి భూముల్లో భారీ అవినీతి జరిగిందని.. కోట్ల రూపాయల కుంభకోణం ఉందని.. అప్పటి సీఎం చంద్రబాబు దగ్గరుండి స్కామ్ కు పాల్పడ్డారని.. వైసీపీ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పటికే సీఐడీ కూడా విచారణలో వేగం పెంచింది.

Ys Jagan

సుప్రీంలో చుక్కెదురు.. AP Govt

అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడా చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దమ్మాలపాటి శ్రీనివాస్ పై తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు.

Indian Supreme Court

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వైసీపీ అభిమానులకు షాక్ ఇచ్చినా.. టీడీపీ నేతలు మాత్రం ఇది తమ నైతిక విజయం అంటున్నారు. ఏపీ ప్రభుత్వం డ్రామాలన్నీ ఏపీ ప్రజలకు అర్థమైందని.. ఇంకా అక్రమ ఆరోపణలు చేస్తే.. ప్రజలే తిరగబడతారని.. అందుకే భయపడి ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను వెనక్కు తీసుకుందని అంటున్నారు.. అయితే అమరావతి భూముల క్రయవిక్రయాలపై ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్నా.. న్యాయస్థానాలు మాత్రం బ్రేకులు వేస్తున్నాయి. మొదట హైకోర్టు.. తాజా సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago