Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక ఫలితాలపై సర్వే.. షాకింగ్ రిజల్ట్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక ఫలితాలపై సర్వే.. షాకింగ్ రిజల్ట్స్?

Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక అయితే పూర్తయింది కానీ… దాని ఫలితాల కోసం అన్ని పార్టీలతో పాటు… తిరుపతి ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే.. భవిష్యత్తులో ఆ పార్టీకి ఏపీలో ఎంతో కొంత బలం ఏర్పడినట్టే. అందుకే… అధికార వైఎస్సార్సీపీతో సహా… బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఫలితాల కోసం తెగ ఆరాటపడుతున్నాయి. నిజానికి.. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 April 2021,5:19 pm

Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక అయితే పూర్తయింది కానీ… దాని ఫలితాల కోసం అన్ని పార్టీలతో పాటు… తిరుపతి ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే.. భవిష్యత్తులో ఆ పార్టీకి ఏపీలో ఎంతో కొంత బలం ఏర్పడినట్టే. అందుకే… అధికార వైఎస్సార్సీపీతో సహా… బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఫలితాల కోసం తెగ ఆరాటపడుతున్నాయి. నిజానికి.. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ మధ్యే. అయితే… ఈ ఉపఎన్నిక ఫలితాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి.

survey on tirupati by election results

survey on tirupati by election results

ఈ సర్వే ప్రకారం… తిరుపతి ఉపఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ గెలవబోతున్నట్టు తెలుస్తోంది. సర్వేలో వైసీపీకి మొత్తం 59 శాతం ఓట్లు పోలయినట్టు వెల్లడయింది. ఆ తర్వాతి స్థానంలో టీడీపీ ఉండనుందట. వైఎస్సార్సీపీకి సుమారు 6 లక్షల 60 వేల ఓట్లు పోలయ్యాయని సర్వే చెబుతోంది. టీడీపీకి సుమారు 3 లక్షల 50 వేల ఓట్లు పోలయ్యాయట. ఇక… బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి మూడో స్థానంలో నిలుస్తారట. బీజేపీ, జనసేన కూటమికి సుమారు 85 వేల ఓట్లు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 15 వేల వరకు ఓట్లు పోలయ్యాయట. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు 6 వేల వరకు ఓట్లు పోలయ్యాయని ఈ సర్వే స్పష్టం చేసింది.

Tirupati Survey Results : ఈసారి టీడీపీ ఓట్లకు గండి

ఈసారి తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంటుందని సర్వే వెల్లడించింది. బీజేపీ పార్టీ 2019 లో కేవలం 16 వేల ఓట్లే సాధించగా.. ఈ సారి మాత్రం అటూ ఇటూగా సుమారు లక్ష వరకు ఆ కూటమికి ఓట్లు పడ్డాయని సర్వే స్పష్టం చేసింది. ఇక.. వైసీపీకి తన ఓటు బ్యాంక్ మాత్రం ఎటూ కదల్లేదు. 2019 ఎన్నికల్లో ఎలాగైతే బంపర్ మెజారిటీతో తిరుపతి ప్రజలు గెలిపించారో… తాజాగా ఈ ఉపఎన్నికల్లోనూ అదే మెజారిటీతో గెలిపించబోతున్నారని సంస్థ తెలిపింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది