Swami Swarupananda : నిన్న ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ సమయంలో ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. దర్శనానికి వచ్చిన శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏపీ ప్రభుత్వంపై చాలా సీరియస్ అయ్యారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజానికి నిన్న చందనోత్సవ సమయంలో భక్తులు క్షేత్రానికి పోటెత్తారు.
దేవాదాయ శాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించక.. వీఐపీలు రాగానే భక్తులను ఆపేసి.. వాళ్లకు దర్శనం కల్పించడంతో భక్తులు నారసింహుడి దర్శనం కోసం గంటలకు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తులు పోలీసులు, అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి భక్తులకు కలుగుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. భక్తులను ఇబ్బంది పెడుతున్న అధికారుల తీరు చూసి తాను ఎందుకు చందనోత్సవానికి వచ్చానా అని బాధపడుతున్నా అని ఆయన తెలిపారు.
నేను జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నారు. కానీ.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తులకు ఇబ్బందులు కలిగాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అంటూ స్వరూపానంద స్వామి మండిపడ్డారు. అసలు ఇంత పెద్ద దైవక్షేత్రం.. ఒక కార్యనిర్వాహక అధికారి ఉండరా? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరైన నిర్ణయాలు లేవు. రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు..అంటూ ఆయన మండిపడ్డారు. ఇక.. క్షేత్రానికి వచ్చిన భక్తులు కూడా ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.