
Swami Swarupananda serious on andhra pradesh government
Swami Swarupananda : నిన్న ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ సమయంలో ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. దర్శనానికి వచ్చిన శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏపీ ప్రభుత్వంపై చాలా సీరియస్ అయ్యారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజానికి నిన్న చందనోత్సవ సమయంలో భక్తులు క్షేత్రానికి పోటెత్తారు.
దేవాదాయ శాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించక.. వీఐపీలు రాగానే భక్తులను ఆపేసి.. వాళ్లకు దర్శనం కల్పించడంతో భక్తులు నారసింహుడి దర్శనం కోసం గంటలకు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తులు పోలీసులు, అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి భక్తులకు కలుగుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. భక్తులను ఇబ్బంది పెడుతున్న అధికారుల తీరు చూసి తాను ఎందుకు చందనోత్సవానికి వచ్చానా అని బాధపడుతున్నా అని ఆయన తెలిపారు.
Swami Swarupananda serious on andhra pradesh government
నేను జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నారు. కానీ.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తులకు ఇబ్బందులు కలిగాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అంటూ స్వరూపానంద స్వామి మండిపడ్డారు. అసలు ఇంత పెద్ద దైవక్షేత్రం.. ఒక కార్యనిర్వాహక అధికారి ఉండరా? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరైన నిర్ణయాలు లేవు. రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు..అంటూ ఆయన మండిపడ్డారు. ఇక.. క్షేత్రానికి వచ్చిన భక్తులు కూడా ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.