
why there is a clash between tdp and janasena party
TDP And Janasena : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా అందుతున్నాయని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న విషయం విదితమే. అయితే, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో గడప గడపకీ వెళ్ళి వాస్తవ పరిస్థితుల్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులకు స్పష్టం చేశారు. అధినేత ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తూ,
గడప వద్దకే సంక్షేమ ఫలాల్ని అందిస్తోన్న వైసీపీ ప్రభుత్వం, వచ్చే ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, వైసీపీకే మళ్ళీ పట్టం కడతామని చెబుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఈ గడప గడపకీ వైఎస్సార్సీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుండడంతో, వచ్చే ఎన్నికల్లో విపక్షాలు కేవలం ఐదు సీట్లు మాత్రమే పంచుకోవాల్సి వస్తుందంటూ వైసీపీ నేతలు సెటైర్లేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 170 నుంచి 175 సీట్లు వచ్చే అవకాశముందనీ, మొత్తంగా 175 సీట్లూ తాము కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తుండడం సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగినందుకే ప్రజలు మనకి 151 సీట్లు ఇచ్చారు. వారికి మెరుగైన పాలన అందించాం. మనకెందుకు 175 సీట్లను ప్రజలు ఇవ్వరు.?
TDP and Janasena have to share only five seats
ప్రజల వద్దకే వెళ్ళండి.. ఇంకోసారి ఇంకా ఘనంగా ఆశీర్వదించమని చెప్పండి.. అంటూ వైసీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.దీనికి తోడు, సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకు అందించే దిశగా సంక్షేమ క్యాలెండర్ రూపొందించి, దాని ప్రకారం ఆయా పథకాల్ని సకాలంలో అందిస్తూ, ఆ విషయం నేరుగా ప్రజలకే చెప్పేందుకు ముఖ్యమంత్రి ఆ ప్రజల వద్దకే బహిరంగ సభలు, ప్రత్యేక కార్యక్రమాలతో వెళుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత ఎన్నికలు జరగాల్సి వుండగా, ఇప్పుడే ఈ ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ జోరు చూస్తోంటే, అధికారంపై కన్నేసిన టీడీపీ, జనసేన.. కలిసి పోటీ చేసినా, కేవలం ఐదు సీట్లే పంచుకోవాల్సి రావొచ్చుననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
This website uses cookies.