TDP : ఆ జిల్లాలో పూర్తిగా భూస్థాపితం అయిన టీడీపీ.. ఇలా అయితే.. 2024 లో టీడీపీ పరిస్థితి ఏంటో?

Advertisement
Published by
Advertisement

కర్నూలు : కర్నూలు జిల్లాలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది. పార్టీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. అధిష్టానం వ్యవహారం నచ్చక కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదనే భావనకు పార్టీ శ్రేణులతో పాటు నేతలు వచ్చారు.

Advertisement

దీంతోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సైకిల్‌ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్‌ మాత్రం టీడీపీలో అంటీముట్టనట్లు కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కేఈ ఫ్యామిలీ హాజరు కావడం లేదు. సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీజీ భరత్, కేఈ శ్యాంబాబు పార్టీ వీడతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు సమాచారం. కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వైఖరి కార్యకర్తలకు మింగుడుపడటం లేదు.

Advertisement

TDP

ఎవరి దారి వారిదే.. TDP

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైనా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నందికొట్కూరులో టీడీపీ నేత బండి జయరాజు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించారు. నియోజకవర్గాన్ని పర్యవేక్షించే మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేరు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆదోనిలో మీనాక్షినాయుడు వయోభారంతో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి, పత్తికొండలో శ్యాంబాబు ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు.

Kurnool Politics

ఆలూరులో కోట్ల సుజాతమ్మ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. పాణ్యం, బనగానపల్లె, కర్నూలు నేతలు స్థానికంగానే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. జిల్లాలోనూ టీడీపీకి చెందిన కొందరు నేతలకు కూడా అధినేత వ్యవహారం నచ్చడం లేదని తెలుస్తోంది.

Advertisement

Recent Posts

12 Years Modi : మోదీ 12 ఏళ్ల పాలనలో దేశాన్ని మార్చిన 12 అద్భుత పథకాలు..!

12 Years Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ పాలనలో 12 సంవత్సరాల మైలురాయిని…

7 minutes ago

Bharathiraja Passes Away : దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత.. 50 ఏళ్ల సినీ ప్రస్థానం, రూ.80 కోట్ల ఆస్తుల కథ

Bharathiraja Passes Away : దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అస్తమించింది. తమిళ చిత్రసీమకు గ్రామీణ కథల…

1 hour ago

Viral Video : గుండెల్ని పిండేసే ఘటన.. ఎద్దు చనిపోవడంతో భార్యను కాడికి కట్టి పొలం దున్నిన రైతు..!

Viral Video : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయో చెప్పే మరో హృదయ విదారక…

2 hours ago

Heavy Rain Alert : దూసుకొస్తున్న రుతుపవనాలు… ఉరుములు, మెరుపులతో ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షాలు..!

Heavy Rain Alert  : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…

3 hours ago

Farmers : రైతులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. పంట నష్టపోతే రూ.38 వేలు..!

Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…

4 hours ago

Komatireddy Venkat Reddy : పేదలకు ఇళ్లు.. రైతులకు మేలు.. నల్లగొండ జిల్లాపై మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక సమీక్ష

Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…

5 hours ago

AP Thalliki Vandanam Scheme : ఏపీ తల్లులకు గుడ్ న్యూస్.. జూలైలోనే తల్లుల ఖాతాల్లో డబ్బులు..!

AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…

6 hours ago

Students Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇక నేరుగా ఖాతాల్లోకి.. సర్కార్ కీలక నిర్ణయం..!

Students Good News  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…

8 hours ago

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 23వ విడత కోసం నిధుల‌ కేంద్రం కీలక ప్రకటన..!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

9 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 2026 జూన్ 10న తాజా రేట్లు ఇవే!

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…

10 hours ago

Rythu Bharosa : ‘నాకు రైతు భరోసా వద్దు’.. డబ్బులు ఆపండి.. అధికారుల చుట్టూ 2 నెలలు తిరిగిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి..!

Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

11 hours ago