ChandraBabu : ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. మాస్ కాపీయింగ్ కు.. పేపర్ లీకేజ్ కు పాల్పడుతున్న ఒకొక్కరిని ఏరి పారేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు అంటే సూచి రాతలు కాదు అని ప్రభుత్వం చెప్పకనే చెబుతూ సీరియస్ గా ఉండటంతో ఎంత మంది ఫెయిల్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. విద్యా వ్యవస్థను మెరుగు పర్చడంలో భాగంగా తాజాగా ప్రముఖ ఆన్ లైన్ టీచింగ్ సంస్థ బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
ఒక్కొక్క విద్యార్థి బైజూస్ ఆన్ లైన్ మెటీరియల్ ను యాక్సెస్ చేసుకోవడంకు పాతిక నుండి ముప్పై అయిదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాని ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఆ బైజూస్ పాఠాలను పేద విద్యార్థులకు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇది ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వంకు కూడా చేతనవ్వలేదు. ఇలాంటి ఒక అద్బుతమైన పనిని కూడా చంద్రబాబు నాయుడు గేలి చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయనే చెల్లింది. పిల్లల చదువుల విషయంలో ఇప్పటికే చేసిన రచ్చ చాలు. పదవతరగతి పిల్లల విషయంలో చేసిన పనితో తెలుగు దేశం పార్టీనే జనాలు విమర్శించారు.
ఇప్పుడు ఉచితంగా బైజూస్ సేవలను పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తానంటూ ఉంటే జై జూస్ కాదు.. జగన్ జూస్ అంటూ అవహేళన చేయడం ఏంటీ అంటూ చంద్రబాబు నాయుడు తీరును సామాన్య ప్రజల నుండి మొదలుకుని ఏకంగా ఆయన సొంత పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. మంచి చేసినప్పుడు పొడగకున్నా పర్వాలేదు కాని ప్రతి విషయాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయాలనే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.