BJP
Telangana BJP యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది. సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర లో ఎక్కువగా యువత కనిపిస్తోంది. పార్టీ కి చెందిన యువ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగం అవుతున్నారు. పాదయాత్ర ఏర్పాట్ల కోసం వేసిన కమిటీల్లోనూ యువనేతలకు ఎక్కువగా చోటు కల్పించారు. ఈ కమిటీ ల్లో పార్టీ నేతల వారసులకు ఎక్కువగా స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారసులు కష్ట పడుతున్నారు. పాద యాత్రలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు.
BJP
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. సంజయ్ సంగ్రామ యాత్ర కు సహా ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ యాత్ర లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా సంజయ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ గ్రేటర్ ఎన్నికల సమయం లో బీజేపీలో చేరారు. పాదయాత్ర సందర్భంగా ఆయనకు కూడా బాధ్యత అప్పగించారు. జన సమీకరణ విభాగంలో ఆయన ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంగ్రామ యాత్రలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
మిథున్ రెడ్డి కూడా సంజయ్ వెంటే ఉంటున్నారు. ప్రచార రథాల విభాగంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు కూడా సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. సంజయ్ వెంట రెగ్యులర్ గా ఉంటున్నాడు. తన టీమ్ తో హడావుడి చేస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. బల ప్రదర్శన చేసుకుంటున్నారు. వాహన శ్రేణి విభాగం లో బాధ్యతలు చూస్తూ సంజయ్ వెంటే ఉంటున్నారు..
bjp mp bandi sanjay fires on police over suryapet issue
ఈ వారసులంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారట. రాజకీయంగా బల పడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట, సంజయ్ సంగ్రామ యాత్ర వారసులకు ఇలా ఉపయోగపడుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో పాదయాత్ర సాక్షిగా, సామర్థ్యం నిరూపించుకునే వారసులెవరో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో బరిలో నిలిచే అవకాశం ఎవరికి వస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.