
kcr
CM KCR : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. ఒకరిని మరొకరు తిట్టడం, ఆరోపణలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. కొందరు నేతలు ఏకంగా సీఎం కేసీఆర్ కే ఎగనామం పెడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ కు తెలియకుండా తెలివిగా గోతులు తీస్తూ తప్పించుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారట. వీళ్ల వల్ల టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయని.. ఆయన అడ్డంగా బుక్కయిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
telangana cm kcr trs party
నిజానికి.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కరోనా కట్టడి మీద. ప్రస్తుతం కరోనా ఎలా వ్యాప్తి చెందుతోందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఎక్కువగా కరోనా నియంత్రణలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యోం కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పని కానిస్తున్నారు. కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా వ్యవహారంలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన ఒక్కరే కాదు.. ఇంకా చాలామంది ఇలాంటి భూకబ్జా వ్యవహారాల్లో ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఈటల మీదనేనా మీ ప్రతాపం. మిగితా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా శుద్ధపూసలా? వాళ్లపై కూడా విచారణ జరిపించండి. వాళ్లను కూడా మంత్రి వర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించండి.. అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈటల రాజేందర్ మాత్రమే కాదు.. మంత్రి మల్లారెడ్డి ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయనపై భూకబ్జాకు సంబంధించిన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పువ్వాడ విషయంలోనూ అంతే.. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పైన కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 90 ఎకరాల భూమికి సంబంధించి.. తనను ఎమ్మెల్యే డబ్బులు అడిగారని.. కాప్రాకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. హైకోర్టుకు కూడా వెళ్లారు.
దీంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డిపై విచారణ జరుగుతోంది. ఒక్క సుభాష్ రెడ్డి మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇలాగే భూకబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దాకా కూడా వెళ్లిందట. కానీ.. ఈ పరిస్థితుల్లో అందరిపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇస్తే.. పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈటలను భూకబ్జా విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసు. కనీసం ఈటల పరిస్థితి చూసి అయినా.. మిగితా వాళ్లు బుద్ధి తెచ్చుకుంటారేమో అని సీఎం కేసీఆర్ భావించారని తెలుస్తోంది. కానీ.. భూకబ్జా ఆరోపణలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా ముందడుగు వస్తారో? చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
This website uses cookies.