CM KCR : తన వెనుక గోతులు తవ్వుతున్న నేతల వల్ల.. అడ్డంగా బుక్కయిపోయిన కేసీఆర్?

Advertisement
Advertisement

CM KCR : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. ఒకరిని మరొకరు తిట్టడం, ఆరోపణలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. కొందరు నేతలు ఏకంగా సీఎం కేసీఆర్ కే ఎగనామం పెడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ కు తెలియకుండా తెలివిగా గోతులు తీస్తూ తప్పించుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారట. వీళ్ల వల్ల టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయని.. ఆయన అడ్డంగా బుక్కయిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

telangana cm kcr trs party

నిజానికి.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కరోనా కట్టడి మీద. ప్రస్తుతం కరోనా ఎలా వ్యాప్తి చెందుతోందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఎక్కువగా కరోనా నియంత్రణలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యోం కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పని కానిస్తున్నారు. కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా వ్యవహారంలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన ఒక్కరే కాదు.. ఇంకా చాలామంది ఇలాంటి భూకబ్జా వ్యవహారాల్లో ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఈటల మీదనేనా మీ ప్రతాపం. మిగితా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా శుద్ధపూసలా? వాళ్లపై కూడా విచారణ జరిపించండి. వాళ్లను కూడా మంత్రి వర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించండి.. అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Advertisement

CM KCR : ఆరోపణలు వస్తున్న మంత్రులందరిపై విచారణ జరిపించాలి

ఈటల రాజేందర్ మాత్రమే కాదు.. మంత్రి మల్లారెడ్డి ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయనపై భూకబ్జాకు సంబంధించిన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పువ్వాడ విషయంలోనూ అంతే.. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పైన కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 90 ఎకరాల భూమికి సంబంధించి.. తనను ఎమ్మెల్యే డబ్బులు అడిగారని.. కాప్రాకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. హైకోర్టుకు కూడా వెళ్లారు.

దీంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డిపై విచారణ జరుగుతోంది. ఒక్క సుభాష్ రెడ్డి మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇలాగే భూకబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దాకా కూడా వెళ్లిందట. కానీ.. ఈ పరిస్థితుల్లో అందరిపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇస్తే.. పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈటలను భూకబ్జా విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసు. కనీసం ఈటల పరిస్థితి చూసి అయినా.. మిగితా వాళ్లు బుద్ధి తెచ్చుకుంటారేమో అని సీఎం కేసీఆర్ భావించారని తెలుస్తోంది. కానీ.. భూకబ్జా ఆరోపణలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా ముందడుగు వస్తారో? చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Maha Shivratri : మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు తప్పక పాటించాల్సిన విషయాలు

Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…

20 minutes ago

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

8 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

9 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

10 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

11 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

13 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

14 hours ago