CM KCR : తన వెనుక గోతులు తవ్వుతున్న నేతల వల్ల.. అడ్డంగా బుక్కయిపోయిన కేసీఆర్?

Advertisement
Advertisement

CM KCR : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. ఒకరిని మరొకరు తిట్టడం, ఆరోపణలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. కొందరు నేతలు ఏకంగా సీఎం కేసీఆర్ కే ఎగనామం పెడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ కు తెలియకుండా తెలివిగా గోతులు తీస్తూ తప్పించుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారట. వీళ్ల వల్ల టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయని.. ఆయన అడ్డంగా బుక్కయిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

telangana cm kcr trs party

నిజానికి.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కరోనా కట్టడి మీద. ప్రస్తుతం కరోనా ఎలా వ్యాప్తి చెందుతోందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఎక్కువగా కరోనా నియంత్రణలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యోం కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పని కానిస్తున్నారు. కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా వ్యవహారంలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన ఒక్కరే కాదు.. ఇంకా చాలామంది ఇలాంటి భూకబ్జా వ్యవహారాల్లో ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఈటల మీదనేనా మీ ప్రతాపం. మిగితా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా శుద్ధపూసలా? వాళ్లపై కూడా విచారణ జరిపించండి. వాళ్లను కూడా మంత్రి వర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించండి.. అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Advertisement

CM KCR : ఆరోపణలు వస్తున్న మంత్రులందరిపై విచారణ జరిపించాలి

ఈటల రాజేందర్ మాత్రమే కాదు.. మంత్రి మల్లారెడ్డి ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయనపై భూకబ్జాకు సంబంధించిన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పువ్వాడ విషయంలోనూ అంతే.. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పైన కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 90 ఎకరాల భూమికి సంబంధించి.. తనను ఎమ్మెల్యే డబ్బులు అడిగారని.. కాప్రాకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. హైకోర్టుకు కూడా వెళ్లారు.

దీంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డిపై విచారణ జరుగుతోంది. ఒక్క సుభాష్ రెడ్డి మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇలాగే భూకబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దాకా కూడా వెళ్లిందట. కానీ.. ఈ పరిస్థితుల్లో అందరిపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇస్తే.. పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈటలను భూకబ్జా విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసు. కనీసం ఈటల పరిస్థితి చూసి అయినా.. మిగితా వాళ్లు బుద్ధి తెచ్చుకుంటారేమో అని సీఎం కేసీఆర్ భావించారని తెలుస్తోంది. కానీ.. భూకబ్జా ఆరోపణలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా ముందడుగు వస్తారో? చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

21 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.