
ap cm ys jagan mohan reddy yrsrcp andhra pradesh politics
YS Jagan : రాజకీయాలంటే అంతే. ఎవ్వరినీ నమ్మకూడదు. వెనుకనే ఉంటూ వెన్నుపోటు పొడిచేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ.. కొన్ని సార్లు తప్పదు. కొందరిని నమ్మాల్సి వస్తుంది. నమ్మి తీరాల్సి వస్తుంది. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఒక్కోసారి కొందరిపై నమ్మకం పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా.. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఆచీతూచీ అడుగు వేయాలి. లేకపోతే.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపే వ్యక్తి ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచింది.
ap cm ys jagan mohan reddy yrsrcp andhra pradesh politics
అయితే.. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాక.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఏ వ్యవస్థ ఎలా ఉంది.. అనే విషయం సీఎంలకు అంతగా అవగాహన ఉండదు. దాని కోసం ఖచ్చితంగా అధికారుల మీద డిపెండ్ అవ్వాల్సిందే. అధికారులను ఆసమయంలో నమ్మాల్సిందే. ఏవైనా పథకాలు ప్రవేశపెట్టినా.. రాష్ట్రంలో అన్ని రంగాల పరిస్థితి ఎలా ఉంది. ఏ వ్యవస్థ ఎలా నడుస్తోంది.. అనే విషయాలు అధికారులకే ఎక్కువగా తెలుస్తాయి.
అయితే.. ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా పని చేస్తోంది? అనే విషయం తెలియాలంటే మధ్యలో ఏవైనా ఎన్నికలు జరగాలి. అప్పుడు అధికార పార్టీని ప్రజలు గెలిపిస్తే.. ఖచ్చితంగా ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల ప్రచారంలోనూ సీఎం జగన్ పాల్గొనలేదు. ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటన చేయలేదు. ఆయన కేవలం క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. కేవలం అధికారుల మీద ఆధారపడి.. ఆయన ముందుకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తున్నారు.
అసలే ప్రస్తుతం ఏపీలో కరోనా కోరలు చాచింది. ఈ టైమ్ లో కూడా అధికారులు ఏది చెబితే అది నమ్మేస్తే.. మొదటికే మోసం వచ్చేసింది. ఉదాహరణకు.. ఆక్సిజన్ నిల్వలపై సీఎం జగన్.. ఎప్పుడు సమీక్ష నిర్వహించినా.. ఆక్సిజన్ నిల్వలు బాగానే ఉన్నాయంటూ అధికారులు చెప్పడం.. అది నిజమేనని జగన్ నమ్మడం.. ఆ తర్వాత ఆక్సిజన్ కొరతతో కరోనా పేషెంట్లు చనిపోవడం.. అప్పుడు ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోయడం.. చాలామంది ఆక్సిజన్ కొరతతో చనిపోయాక కానీ.. జగన్ కు తెలిసిరాలేదు.
అందుకే.. కేవలం అధికారుల మీద ఆధారపడటం వల్ల ప్రస్తుతం కరోనా విషయంలో సీఎం జగన్ కు కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలంటే.. అధికారులే కాదు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కూడా నివేదిక తెప్పించుకొని ఉంటే.. ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. అధికారులను ఎక్కడ ఉంచాలో అక్క్డడ ఉంచి.. తన పాలనను జగన్ సాగించాలని.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలను.. ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలంటూ కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. చూద్దాం మరి.. సీఎం జగన్ భవిష్యత్తులో ఎలా ముందడుగు వేస్తారో?
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.