Telangana High Court orders to break the strong room
Telangana High Court : చాలా రోజుల నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఉంది. దీనిపై తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపిక అవడంపై ప్రస్తుతం వివాదం నెలకొన్నది. ఆయన ఎన్నిక చెల్లదు అంటూ ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి విమర్శిస్తున్నాయి.
ధర్మపురి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించిన వీవీ ప్యాట్ల సమాచారం తమకు ఇవ్వాలని లక్ష్మణ్ హైకోర్టును కోరగా.. ఆ సమాచారం ఆయనకు ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారిని కోర్టు ఆదేశించింది. అయితే.. అవన్నీ స్ట్రాంగ్ రూమ్ లో ఉండటంతో ఆ స్ట్రాం రూమ్ గది తాళాలు ఎక్కడో పోయాయి.
స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేకపోవడంతో దాన్ని తెరవలేకపోయామని జిల్లా కలెక్టర్ కోర్టుకు చెప్పడంతో స్ట్రాంగ్ రూం సీల్ పగులగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. కాకపోతే అన్ని పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలని సూచించింది. తాళం తెరిచే వాళ్ల సాయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను ఏప్రిల్ 24కు కోర్టు వాయిదా వింది. దీంతో త్వరలోనే స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని కలెక్టర్ పగులగొట్టి.. ఆ సమాచారాన్ని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కు ఇవ్వనున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.