GVL Narasimha Rao : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి కృషి చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న మధ్య.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై BRS నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ పోరాటం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిందని.. ఈ విషయంలో ఏపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని వైరల్ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ తర్వాత రోజే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్రం ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. అయితే ఈ విషయంపై ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిపోవటానికి ప్రధాన కారణం అంతకు ముందు ప్రభుత్వాలని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో… స్టీల్ ప్లాంట్ గురించి సరిగ్గా పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లిపోయిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడంలో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయదని జీవీఎల్ నరసింహారావు కరాకండిగా చెప్పేశారు. అయితే ఇది లాంగ్ ప్రాసెస్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదగక పోవడానికి ప్రధాన కారణం కొన్ని మీడియా సంస్థలు. అయినా గాని ప్రజల కోసం తమ వంతు కృషి చేసి పోరాడుతున్నామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.