GVL Narasimha Rao : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి కృషి చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న మధ్య.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై BRS నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ పోరాటం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిందని.. ఈ విషయంలో ఏపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని వైరల్ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ తర్వాత రోజే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్రం ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. అయితే ఈ విషయంపై ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిపోవటానికి ప్రధాన కారణం అంతకు ముందు ప్రభుత్వాలని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో… స్టీల్ ప్లాంట్ గురించి సరిగ్గా పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లిపోయిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడంలో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయదని జీవీఎల్ నరసింహారావు కరాకండిగా చెప్పేశారు. అయితే ఇది లాంగ్ ప్రాసెస్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదగక పోవడానికి ప్రధాన కారణం కొన్ని మీడియా సంస్థలు. అయినా గాని ప్రజల కోసం తమ వంతు కృషి చేసి పోరాడుతున్నామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.