TRS : టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కరోనా పంజాకు చిక్కుకుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముందు వరకు టీఆర్ఎస్ పార్టీలో కరోనా ప్రభావం అంతగా లేదు. అప్పుడప్పుడే కరోనా తన కోరలు చాచడం ప్రారంభించింది. అయినప్పటికీ.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు… ఇలా వరుసగా ఎన్నికలు రావడంతో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ర్యాలీలలో పాల్గొన్నారు. సభలు సమావేశాల్లో పాల్గొనడంతో కరోనా తన ప్రతాపాన్ని చూపించింది.
ఈనెల 14న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ హాలియా వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే.. సీఎం సభ అనగానే వేల మంది స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం… గుంపులు గుంపులుగా జనాలు ఆ సభకు రావడంతో నాగార్జునసాగర్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఆ సభకు వెళ్లిన చాలామంది టీఆర్ఎస్ నేతలకు కరోనా సోకింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కూడా కరోనా సోకింది. మరికొందరు సాగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులకూ సోకింది. అక్కడే సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ సభలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చారు. వచ్చిన మూడునాలుగు రోజుల తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. అప్పటి వరకు ఆయనకు కరోనా సోకినట్టు తెలియకపోవడంతో అప్పటికే ఆయన చాలామంది టీఆర్ఎస్ పెద్దలతో సమావేశమయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ తోనూ కలిసి ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ ముఖ్య నేతలకు కూడా కరోనా భయం పట్టుకుంది.
సీఎం కేసీఆర్ కు కరోనా రావడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆపేసి… ఫాం హౌస్ లో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు కేసీఆర్. టెస్టుల కోసం ఓసారి యశోద ఆసుపత్రికి వెళ్లారు అంతే. అంతకుమించి ఆయన బయటికి రావడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో… కేసీఆర్ బాధ్యతలను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఓవైపు పార్టీ పనులతో పాటు ప్రభుత్వ పనులను కూడా కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ కు కూడా తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఈ మధ్య కాలంలో కలిసిన వాళ్లు.. కరాచలనం చేసిన వాళ్లు అందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకొని హోం క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు.
కేటీఆర్ కు కూడా పెద్దగా లక్షణాలు లేవు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది. అయితే… టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు, ఇతర నేతలకు కూడా కరోనా భయం పట్టుకుందట. కేసీఆర్ కు, కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వాళ్లందరూ తమకు కూడా కరోనా వస్తుందేమోనని తెగ టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా కరోనా మాత్రం టీఆర్ఎస్ పెద్దలను తెగ భయపెట్టేస్తోంది.
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
This website uses cookies.