
That is why YS Jagan Is Calling them As Dushta Chatustayam
YS Jagan : పదే పదే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ‘దుష్ట చతుష్టయం’ అనే ప్రస్తావన తెస్తున్నారు.? అంటే, దానికి చాలా కారణాలున్నాయి. ప్రతి విషయానికీ టీడీపీ అను‘కుల’ మీడియా గగ్గోలు పెడుతుంటుంది. తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా, ఆ పార్టీ అను‘కుల’ మీడియా, వైఎస్ జగన్ సర్కారుకి వ్యతిరేకంగా పిచ్చి వార్తల్ని ప్రచారంలోకి తెస్తుంటుంది. అదే అసలు సమస్య. రాష్ట్రానికి అప్పులు దొరక్కూడదు.. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయకూడదు.. ఇలా సాగుతుటుంది టీడీపీ అను‘కుల’ మీడియా తీరు. ఏ మీడియా సంస్థ అయినా, ఓ రాష్ట్రం బాగుపడకూడదని కోరుకుంటుందా.? కానీ, ఆంధ్ర ప్రదేశ్లో కాకుండా పొరుగు రాష్ట్రంలో తమ ఆస్తుల్ని పెట్టుకున్న ఆయా మీడియా సంస్థల యజమానులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తుంటారు. అందుకే, పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటివారిని ‘దుష్ట చతుష్టయం’గా పేర్కొనాల్సి వస్తుంది.
కోవిడ్ వల్ల జరిగిన మరణాల విషయమై కేంద్రం ఓ లెక్క విడుదల చేసింది. అందులో, ఆంధ్రప్రదేశ్ అధికారికంగా పేర్కొన్న కోవిడ్ మరణాల కంటే ఎక్కువ సంఖ్యలో కోవిడ్ మృతులకు పరిహారం అందించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కోవిడ్ మరణాన్ని ధృవీకరించడానికి అప్పట్లో చాలా నియమ నిబంధనలుండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందడాన్ని స్వాగతించాలి కదా.? కానీ, కొత్త అనుమానాల్ని టీడీపీ అను‘కుల’ మీడియా తెరపైకి తెచ్చింది. ఇదొక్కటే కాదు, రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు, రోడ్డు పక్కన వుండే భూముల ధరల్ని ప్రభుత్వం పెంచాలనుకుంటే.. దాన్నీ ఓ నేరంగా చూపుతోంది తెలుగు దేశం పార్టీ అను ‘కుల’ మీడియా. ఒకటా.? రెండా.? అను నిత్యం ఇదే పరిస్థితి.
That is why YS Jagan Is Calling them As Dushta Chatustayam
వరదల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు 2 వేల రూపాయల తక్షణ సాయాన్ని వైఎస్ జగన్ సర్కారు అందిస్తోంటే, అది ఈ మీడియాకి కనిపించడంలేదు. టీడీపీ చేసిన ఆరోపణల్ని పదే పదే ప్రస్తావించి, వైసీపీ మీద బురద చల్లడం ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు రాయడం తప్ప.. ప్రజలకు అందుతున్న సాయం గురించి అస్సలేమాత్రం ప్రస్తావించడంలేదు సోకాల్డ్ మీడియా. టీడీపీ అంటే వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి. కానీ, ఈ మీడియాకి ఏమయ్యింది.? మీడియా ఎందుకు వైసీపీ మీద రాజకీయ వైరం ప్రదర్శిస్తోంది.? అందుకే, ముఖ్యమంత్రి సదరు మీడియాపై మండిపడుతుంటారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆ తెలియజేసే ప్రయత్నంలోనే వైఎస్ జగన్, ‘దుష్ట చతుష్టయం’ అని అంటుంటారు.
T20 World Cup 2026 : క్రికెట్ టోర్నీలో అత్యంత కీలకమైన సూపర్-8 దశకు తెరలేచింది. గ్రూప్-1లో టీమిండియా తన…
Vijay Deverakonda Rashmika Mandanna : విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న…
Janasena Party : జనసేన పార్టీ లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కింది స్థాయి నాయకులు మరియు కార్యకర్తలలో ఒక…
Amardeep : స్టార్ మా ఛానెల్ star maa channel లో ప్రసారమవుతున్న బీబీ జోడీ సీజన్ 2 BB JODI…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూ జరుగుతున్న చర్చలు ఇప్పుడు సరికొత్త…
Bill Gates Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల బిల్ గేట్స్ రాక చుట్టూ జరిగిన ప్రచారం…
Viral News : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సంచలనానికి దారితీసిన ఓ కుటుంబ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 42 ఏళ్ల…
Indiramma Houses Scheme : రాష్ట్రంలోని గృహరహితులకు సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ…
Designer Rice : ప్రస్తుత కాలంలో మధుమేహం షుగర్ , రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు సామాన్యులను పీడిస్తున్నాయి. వీటికి…
Rajya Sabha Elections : దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 10…
Viral video : పెళ్లి వేడుకలు అంటే ఆనందం, ఆర్భాటం, ఆతిథ్యం. అయితే పంజాబ్లో జరిగిన ఒక పెళ్లి వేడుక…
PM-KISAN : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది…
This website uses cookies.