Home » Exclusive » The Maximum Temperature Will Reach 50degree
Exclusive

Temperature : 50 డిగ్రీలకు చేరుకోనున్న గరిష్ట ఉష్ణోగ్రత… ఈ అధిక వేడి కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం… జర జాగ్రత్త…

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 2, 2024 7:13 pm
Advertisement

Temperature : ఢిల్లీతోపాటుగా ఉత్తర భారత దేశం అంతటా కూడా నిప్పుల వర్షం అనేది కురుస్తుంది. ఆరు బయట వేడిగాలులు వీస్తూ ఉండటం వలన ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దీని వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అనే సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై వైద్యులు కూడా స్పష్టమైన వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 50కు చేరుకుంటుంది. అధిక వేడి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. విప్రతమైన వేడి కారణంగా శరీరంలో డిహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. దీనివలన రక్తము అనేది చిక్కబడి శరీరమంతా రక్త ప్రసరణ అనేది మందగించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇది కొన్ని తీవ్రమైన పరిస్థితులలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలను కూడా పెంచుతుంది. గత వారం ఇలాంటి వారు ముగ్గురు PSRI ఆస్పత్రికి వచ్చారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది. ముగ్గురు రోగులు స్పష్టమైన ప్రసంగం మరియు చేయి బలహీనత లాంటి లక్షణాలను చూపించారు. దీనితో పాటుగా పొడి బారటం మరియు తక్కువ మూత్ర విసర్జన లాంటి నిర్జలీకరణ లక్షణాలు కూడా ఉన్నాయి…

Advertisement

Temperature హీట్ స్ట్రోక్ నాడీ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది

సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ శుక్ల మాట్లాడుతూ, రోగుల కిడ్ని పరిధిని పరిశీలిస్తే వారికి డిహైడ్రేషన్ వలన ఇలా జరిగింది అని తేలింది అన్నారు. ఇద్దరూ రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మహిళ మాత్రం ఇంకా చికిత్స పొందుతూ ఉన్నది. మరియు వైద్యుల పరిశీలనలో ఉంచారు. విపరీతమైన వేడిలో ఉష్ణోగ్రత అనేది 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ ప్రమాదం అనేది ఉంటుంది. హీట్ స్ట్రోక్ అనేది తీవ్రమైన పరిస్థితి. దీనితో ఉష్ణోగ్రత ఎంతో పెరుగుతుంది. తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. హీట్ స్ట్రోక్ మెదడు మరియు నాడీ వ్యవస్థ పై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది అని వైద్యులు తెలిపారు. శరీరాన్ని తమను తాము చల్లగా ఉంచుకోవడంలో విఫలమైనప్పుడు,శరీరంలో తీవ్రమైన డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. మరియు ఇది అలారం బెల్. బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ల చికిత్స ఫలితం మరియు మరణాల రేటు ముఖ్యంగా శరీరంలోని ప్రధానమైన ధమానులలో అడ్డంకులు ఉన్నవారిలో శరీరంలో నీటి కొరత అనేది నేరుగా సంబంధ ఉన్నట్లు పరిశోధనలో తేలింది అని డాక్టర్ శుక్ల తెలిపారు. అలాగే ఆసుపత్రిలో చేరటంలో నిర్దలీకరణ కావడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ యొక్క తీవ్రత మరియు మరణాలు అనేవి పెరుగుతున్నాయి. స్ట్రోక్ వచ్చిన తర్వాత సరైన మొత్తంలో ద్రవాలను తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మింగటంలో ఇబ్బంది ఉన్న రోగులకు శరీరంలోని నీరు లేకపోవడం సక్రమంగా చికిత్స చేయకపోతే రోగి పరిస్థితి అనేది తీవ్రంగా మారుతుంది. మరియు కోలు కొవడం లో కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది.

Temperature : 50 డిగ్రీలకు చేరుకోనున్న గరిష్ట ఉష్ణోగ్రత… ఈ అధిక వేడి కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం… జర జాగ్రత్త…

Advertisement

Temperature బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది

అధిక వేడికి గురికావడం వలన హీట్ స్ట్రోక్ వస్తుంది. కొన్ని సందర్భాలలో బ్రేయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది అని ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మంజూరి త్రిపాటి హెచ్చరించారు. హీట్ స్ట్రోక్ వలన రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్ లు వస్తాయి అని తెలిపారు. శరీరంలో నీరు లేకపోవడం మరియు రక్తంలో తక్కువ స్థాయి నీటి కారణం వలన కూడా మెదడు రక్తాన్ని సరఫరా చేసే సిరమ్ లో లీకేజ్ అనేది ఉంటుంది. దీని కారణం వల్లన రక్తం అనేది మందంగా కూడా మారవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో రక్తహీనత స్ట్రోక్ లేక హేమరేజిక్ స్ట్రోక్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రక్తం ప్రవహిస్తుంది. మరియు రెండవది రక్తం ప్రవహించదు. అధిక రక్తపోటు షుగర్, దోమపానం అలవాటు, మద్యపానం, ఊబకాయం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లేక గుండె సమస్యలు లాంటి సమస్యలు ఉన్నవారికి హిట్ స్టాక్ వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని డాక్టర్ త్రిపాఠి తెలిపారు. అందువలన ముఖ్యంగా అలాంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు అధిక వేడికి నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని తెలిపారు. హీట్ స్ట్రోక్ గురించి అవగాహన మరియు నివారణ చర్యలు చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరియు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఈ జాగ్రత్తలు లాంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు అని ధర్మశీల నారాయణ్ హాస్పటల్ న్యూరో సర్జరీ విభాగం అధిపతి ఆశిష్ శ్రీ వాస్తవ అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి