
#image_title
తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని, తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ మహారాష్ట్ర కలిపి కనీసం 50 ఎంపీ సీట్లు గెలవాలని, తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలని, వీలైతే ప్రధాని పీఠం అధిష్టించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత ఏడాది వరకు ఈ ఆలోచన చేశారు. తాను ప్రధాని అయితే రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతారని కలలు కన్నారు. కానీ అవేమీ నెరవేరలేదు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఊసే ఎత్తడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 400 కార్ల కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లి అయిదారు సభలు నిర్వహించారు. తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని, మహారాష్ట్ర కూడా బంగారు మహారాష్ట్ర చేస్తానని హామీలు ఇచ్చారు. పింఛన్లు పెంచుతామని ఇంకా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పారు.
మహారాష్ట్ర కోసం ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నారు. వివిధ పార్టీల నేతలను ప్రగతి భవన్ కి పిలిపించి చేర్చుకున్నారు. పార్టీ కార్యకలాపాల కోసం మహారాష్ట్ర ఇన్ చార్జిగా తన బంధువులు కూడా నియమించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. నాగపూర్ లో కార్యాలయం ప్రారంభానికి 400 కార్ల కాన్వాయ్ తో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ మంచి స్పందన వస్తుందని లోక సభ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 సీట్లు గెలుస్తామని లెక్కలు కూడా చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచారని ప్రచారం కూడా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు అంతా పూర్తిగా సైలెంట్ గా ఉండిపోయారు. తెలంగాణ ఎంతో అభివృద్ధి చేశామని అక్కడ చెప్పి ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓడిపోవడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మహారాష్ట్ర వాసులకు ఏం చెప్పాలో తెలియని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు చేరికలు ఆగిపోయాయి. తెలంగాణ వాసులకు తెరుచుకొని ప్రగతి భవన్ గేట్లు నాడు ఇతర రాష్ట్రాల వారికి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేశారు. దీంతో మహారాష్ట్ర నేతలు ఇటువైపు కూడా చూడడం లేదు. కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇక త్వరలోనే లోక సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని బీజేపి నేతలు చెబుతున్నారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ సమాయత్తం అవుతున్నాయి. తమది కూడా జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ మహారాష్ట్ర పై చేతులు ఎత్తేసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ పోటీ చేసిన ఓడిపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.