Crime : సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కట్టుకున్న భర్తను అందరిముందే గొడ్డలితో నరికి హతమార్చింది. విఠలాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఆ మహిళ భర్త మార్కంటి ఎల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న
పోలీసులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు.ఇరుగు పొరుగు వారి సమాచారం మేరకు.. కుటుంబ కలహాలే హత్యా ఘటనకు దారి తీశాయని ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొన్ని నెలల క్రితం భార్యా భర్తల మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది. భర్త ఎల్లయ్య.. భార్యను ఏవో కారణాలతో తరచూ వేధించే వాడని సమాచారం.
బుధవారం నాడు కూడా ఇలాగే ఇరువురి మధ్య తలెత్తిన గొడవల్లో…విసిగిపోయిన సదరు మహిళ.. ఆగ్రహానికి గురై క్షణికావేశంలో భర్తను కిరాతకంగా నరికి చంపినట్లు సమాచారం. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు ప్రారభించారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.