Srikakulam : భార్య మరణం తట్టుకోలేక.. శ్రీకాకుళం జిల్లాలో భర్త చేసిన పని.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Srikakulam : భార్య మరణం తట్టుకోలేక.. శ్రీకాకుళం జిల్లాలో భర్త చేసిన పని.. వీడియో వైరల్..!!

Srikakulam : ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల బంధం కల్తీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇంట్లో కుటుంబం ఉన్న మరోపక్క బయట సైడ్ యవ్వారాలు… అక్రమ సంబంధాలు నడిపించే భర్తలు, భార్యలు… సమాజంలో ఎక్కువైపోతున్నారు. దీంతో పిల్లల జీవితాలు ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆ పిల్లలను సమాజం చాలా చిన్న చూపు చూడటంతో… అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమాజంలో భార్య చనిపోయిన మూడు రోజులకే ఓ భర్త… భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :22 April 2023,10:00 am

Srikakulam : ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల బంధం కల్తీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇంట్లో కుటుంబం ఉన్న మరోపక్క బయట సైడ్ యవ్వారాలు… అక్రమ సంబంధాలు నడిపించే భర్తలు, భార్యలు… సమాజంలో ఎక్కువైపోతున్నారు. దీంతో పిల్లల జీవితాలు ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆ పిల్లలను సమాజం చాలా చిన్న చూపు చూడటంతో… అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమాజంలో భార్య చనిపోయిన మూడు రోజులకే ఓ భర్త… భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్ల పేట గ్రామానికి చెందిన… 27 ఏళ్ల మంగరాజు రాజబాబు 2016లో ఆర్మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతడికి అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్లి జరిగింది. కాగా రాజాబాబు ప్రజెంట్ హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక ఏడు నెలల గర్భవతి. ఆమెకు ఇటీవల హెల్త్ ఇష్యూస్ రావడంతో రాజాబాబు తండ్రి సత్యనారాయణ…. విశాఖపట్నంలో ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే సెలవు పై రాజాబాబు ఇంటికి చేరుకున్నాడు.

The work done by the husband in Srikakulam district unable to bear the death of his wife video

The work done by the husband in Srikakulam district, unable to bear the death of his wife video

భార్యను బతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి కావటంతో పరిస్థితి విషమించటంతో ఈ నెల 16వ తారీఖున మౌనిక మృతి చెందింది. ఇంత భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజాబాబు.. సరిగ్గా భోజనం కూడా చేయకుండా అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 19వ తారీకు ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకుని వస్తానని .. చెప్పి తోటలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. అనంతరం ఫ్రెండ్స్ కి మెసేజ్లు పెట్టి ఇన్సూరెన్స్ ఇంకా అనేక విషయాలు కుటుంబానికి రావలసిన వాటి గురించి తెలియజేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు కొడుకు మరణ వార్త తెలుసుకుని విలవిలలాడిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది