Teenmar Mallanna క్యూ’ న్యూస్ నిర్వాహకుడు, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు క్యూ న్యూస్లో వార్తలు ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మల్లన్నను విడుదల చేయించేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారని చెబుతున్నారు. మల్లన్న ట్విట్టర్ ఖాతాలోనూ ‘జై బీజేపీ’ అని ట్వీట్ చేయడం గమనార్హం. జైలు నుంచి విడుదలయ్యాక మల్లన్న బీజేపీలో చేరే అవకాశం ఉంది. అయితే తీన్మార్ మల్లన్న బీజేపీ మనిషి అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. అన్ని పార్టీల నేతలను, విధానాలను చీల్చి చెండాడే మల్లన్న బీజేపీ విధానాలపై గానీ, నేతలపై గానీ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కేసులు ఎదుర్కొన్న ప్రతిసారి బీజేపీ నేతలే ఎక్కువ అండగా నిలబడుతున్నారు. మల్లన్న తరుపునప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
ఇక మల్లన్న సామాజికవర్గం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్లు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారన్న విషయం తెలిసిందే. దీంతో వీరి బంధం మరింత బలపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ సామాజికవర్గం ప్రస్తుతం బీజేపీ వెనుక ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు. గత నెలలో హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన సంగతి తెలిసిందే.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సైతం అక్కడికి వచ్చి మల్లన్నకు మద్దతుగా నిలిచారు. మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ప్రచారానికి ఈ పరిణామంతో బలం చేకూరినట్లయింది. కేసీఆర్ సర్కార్ను ఒంటరిగా ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోదని గ్రహించిన మల్లన్న అందుకే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మల్లన్న మొదటి నుంచి తనది బహజన వాదం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ మల్లన్న ట్విట్టర్ ప్రొఫైల్లో ‘బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో…’ అని రాసి ఉండటం గమనార్హం. అయితే ఇన్నాళ్లు బహుజనుల పేరు చెప్పిన మల్లన్న… ఇప్పుడు బీజేపీ గూటిలో చేరేందుకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.