TRS Party ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన నేతలకు పదిరోజుల్లోనే అందలం ఎక్కించడంతో టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం షురూ అయింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నా, ఫలితం లేదన్న టాక్ కేడర్ లో వినిపిస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ TRS Party ఓడిపోయిన తర్వాత తేరుకున్న గులాబి TRS Party బాస్ .. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నాగార్జున సాగర్ నుండి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీని విజయఫథంవైపు నడిపిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ KCR తీరు పూర్తిగా మారిపోయింది.
కేవలం ఉప ఎన్నికలో విజయం కోసం అనేక అభివృధ్ది కార్యక్రమాలతోపాటు పార్టీ పదవుల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇదే మరో కొత్త రచ్చకు కారణమవుతోందని తెలుస్తోంది. తాజాగా కేవలం పదిరోజుల్లోనే పార్టీ మారిన ప్రత్యర్ధి నేతలను అందలం ఎక్కించారు. ఎంతో మంది సీనియర్లను కాదని పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఈ కీలక పరిణామంతో హుజూరాబాద్తో పాటు రాష్ట్రంలోని పార్టీ కేడర్కు గెలుపే లక్ష్యమనే సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం .. పార్టీలో ముఖ్యంగా పాతకాపుల్లో మరో రచ్చకు కారణమవుతోందని కిందిస్థాయి కేడర్ లో చర్చలు సాగుతున్నాయి. పాతకాపులు ఏం చేస్తారన్నదే కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పాత కేడర్ ఎలా ముందుకు సాగుతుందనే మీమాంస కార్యకర్తల్లో నెలకొంది. ఇక పాత కేడర్ను పక్కన పెడితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇటివల పార్టీ చేరికలతో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో అనేక మంది ఇతర పార్టీ నేతలు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరికి ఎలాంటి పదవులు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కంటే సీనియర్లైన రమణ వంటి నేతలు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
వీరందరికీ ఏ హామీలు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారనేది తేలాల్సిన అంశం. ఇప్పటికే హుజూరాబాద్కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ తోపాటు ఓ ఎమ్మెల్సీ కూడా వచ్చింది. ఇక మిగిలింది ఇటివల పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డిలతో పాటు స్వర్గం రవిలకు ఏం కట్టబెట్టనున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే పాతకాపులు ఎమ్మెల్సీ సీట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వీరిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై అంతర్గతంగా రచ్చ సాగుతోందట. పార్టీని నమ్ముకుని, సేవ చేస్తోన్న తమకు పదవులు ఇవ్వకపోవడంపై వీరంతా కినుక వహించినట్లు సమాచారం. మరి వీరందరి అసంతృప్తిని కేసీఆర్ KCR ఏవిధంగా తగ్గిస్తారన్న దానిపై కేడర్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.