TRS Party
TRS Party హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంతో గద్దర్తో టీఆర్ఎస్ TRS Party నేతలు మంతనాలు జరపడం తెలంగాణ Telangana రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నికల్లో మద్దతు కోసమే ఆయన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హజురాబాద్ ఉపఎన్నికలు, రేవంత్ రెడ్డి Revanth reddy వర్సెస్ మల్లారెడ్డి, బండి సంజయ్ పాదయాత్ర…ఇలా వరుస ఎపిసోడ్లతో రోజుకు రోజుకు సెగలు రేపుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్తో టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అల్వాల్ భూదేవినగర్లోని నివాసంలో గద్దర్తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు.
TRS
దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వీరంతా గద్దర్కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని గద్దర్ ను కోరినట్లు సమాచారం. ఐతే గద్దర్ మాత్రం టీఆర్ఎస్ హామీ ఇవ్వలేదని, తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
వారం రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని గద్దర్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్ నేతలు గద్దర్తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకు అప్రమత్తమై.. గద్దర్ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను పంపించారని ప్రచారం జరుగుతోంది.
Trs party leaders meet with gaddar
ఐతే గద్దర్తో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని.. కేవలం మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిస్తే.. రానున్న రోజుల్లో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని భావిస్తోంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. అందుకే గద్దర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే గద్దర్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గద్దర్ తటస్థ వైఖరిపైనా సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటికే కేసులతో నానా తంటాలు పడుతోన్న గద్దర్ .. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్న వైఖరికి వచ్చారని టాక్ వినిపిస్తోంది.
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
This website uses cookies.