Thummala Nageswara Rao : టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఏకం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యనేతలు ఇటీవల సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇతర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.అయితే పార్టీలో తమకు జరిగిన అన్యాయం, ప్రాధాన్యత తగ్గించి జూనియర్లకు ప్రాధాన్యతనివ్వడం పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళా టీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ వచ్చే అవకాశాలు లేకపోతే ఏం చేయాలనేదానిపై కూడా మాట్లాడినట్లు సమాచారం.
దీంతో ఇద్దరు సీనియర్లు, పార్టీ అసంతృప్తులు భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీఆర్ెస్ను వీడేందుకు సిద్దమవుతున్నారనే చర్చ జరుగుతోంది.అయితే తుమ్మల అనుచరులు పాలేరు నియోజకవర్గంలోని నేతలు కూడా రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రుల భేటి తర్వాత ఈ నేతలు మీటవ్వడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ నుంచైనా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా తుమ్మల వెంటే ఉంటామని పాలేరు నియోజకవర్గంలోని నేతల తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలనుంచి టీఆర్ెస్లోకి వచ్చిన నేతలు తమను టార్గెట్ చేస్తున్నట్లు.. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకుళ్లడానికే భేటి అయ్యామని చెబుతున్నట్లు సమాచారం.
అయితే ఈ భేటీకి మాజీమంత్రి సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉన్నారు.తాజాగా యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. తెలంగాణలోని టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలు బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. తుమ్మల కూడ అదే బాటలో పయనించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తున్న నేతలంతా ఏకతాటిపైకి వచ్చి త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15 తర్వాత రాజకీయాల్లో భారీ పరిణామాలు జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ ఖమ్మం నేతలు అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.