YS Jagan : ఏపీలో అదే కనుక జరిగితే.. వైఎస్ జగన్ కు కష్టమే.. రెండో సారి ముఖ్యమంత్రి పీఠం కలగానే మిగులుతుంది?

YS Jagan : వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. 2019 లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్ కు ఈ మూడేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాకే సరిపోయాయి. 2024 లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడిప్పుడే సీఎం జగన్.. ప్రభుత్వ కార్యక్రమాల మీద, సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతున్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా ఇంకా చాలా ప్రజలకు చేయాలని ఉన్నా.. మొదటి టర్మ్ పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ఆయనకు రెండో చాన్స్ ఏపీ ప్రజలు ఇస్తారా? ఇవ్వరా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. ఓవైపు కరోనా..

మరోవైపు వరదలు. వరదలతో ఏపీ మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. రైతుల పూర్తిగా పంటలను నష్టపోయి రైతాంగానికి వరద సాయాన్ని ప్రభుత్వం అందించడంలో విఫలం అయింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక జగన్… కేవలం విద్య, వైద్యం మీదనే దృష్టి పెట్టారనే వార్తలూ వినిపిస్తున్నాయి. విద్య, వైద్యం మీదనే దృష్టి పెట్టి మిగిలిన శాఖలను సీఎం విస్మరించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు అనే అపవాదు కూడా లేకపోలేదు.

YS Jagan : వచ్చే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరిగితే?

two years left as cm for assembly elections in ap

ఇవన్నీ పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కువ శాతం పోలింగ్ ఏపీలో జరిగితే మాత్రం నష్టపోయేది జగనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం పేద వర్గాలు పోలింగ్ లో పాల్గొంటే జగన్ కు వచ్చే నష్టమే లేదు. కానీ.. ఉన్నత స్థాయి వర్గాలు, మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువ శాతంలో పోలింగ్ లో పాల్గొంటే వాళ్ల వల్ల జగన్ కు తీరని నష్టం జరుగుతుందనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు వినిపించడానికి కారణమూ ఉంది. కేవలం పేదలకు నిధులను పంచిపెట్టడమే పనిగా జగన్ పెట్టుకున్నారని.. అభివృద్ధిని జగన్ పక్కన పెట్టారనే వార్తలూ గుప్పుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయితే మాత్రం అవి జగన్ కు వ్యతిరేకంగా పోల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇటీవల రెండు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం వైసీపీకే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వస్తాయని తేలింది. ఆ సర్వేలో కూడా పాల్గొన్నది పేద ప్రజలే. వాళ్ల నాడి ప్రకారం జగన్ గెలుస్తారు. కానీ.. ఉన్నత స్థాయి వర్గం, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ శాతం పోలింగ్ లో పాల్గొంటే మాత్రం జగన్ కు కష్టమే అంటున్నారు. ఒకవేళ ఈ రెండేళ్లలో జగన్ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తే మాత్రం చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం.. భవిష్యత్తులో ఏం జరగనుందో.

Recent Posts

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

39 minutes ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

2 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

3 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

12 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

13 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

14 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

15 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

15 hours ago