Home » Exclusive » Udyogini Scheme Details In Telugu Complete Details About Udyogini Scheme
Exclusive

Udyogini Scheme : కేంద్ర ప్రభుత్వం నుండి 0 వడ్డీకి 3 లక్షల లోన్ ..లక్ష యాభై వేలు సబ్సిడీ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 6, 2023, 6:00 pm
Advertisement

ఈ స్కీమ్ పేరు ఉద్యోగిని స్కీం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2020లో మహిళల కోసం మొదలుపెట్టింది. సొంత వ్యాపారం చేయడానికి లేదా వ్యాపారం అభివృద్ధి చేయలనుకునే మహిళలకు ఇది వర్తిస్తుంది. కచ్చితంగా భవిష్యత్తులో బిజినెస్ సక్సెస్ అవుతుంది అనుకుంటే వాళ్లకు కచ్చితంగా ఈ లోన్ ఇస్తారు. ఆల్రెడీ బిజినెస్ ఉండి దానిని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే దానికి మంచిగా లాభాలు వస్తాయనుకుంటే దానికి లోన్ తప్పకుండా ఇస్తారు. ఈ విధంగా పథకం లోన్ వర్క్ అవుట్ అవుతుంది. గరిష్టంగా మూడు లక్షలు ఇస్తారు. అయితే బిజినెస్ అనేది మూడు లక్షల కంటే తక్కువ గా స్టార్ట్ చేయాలి.

Advertisement

అంతకుమించి ఎక్కువ బడ్జెట్ అంటే ఈ లోన్ అందదు. అయితే వడ్డీ సున్నా. కాకపోతే అది కేవలం ఎస్సీ, ఎస్టీ, అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే. మిగతా వాళ్ళు వడ్డీ కట్టాలి. అలాగే 30% సబ్సిడీలు వితంతువులకు, అంగవైకల్యం ఉన్నవాళ్లకు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 50% సబ్సిడీ లభిస్తుంది. వార్షికాదాయం రెండు లక్షల కన్నా తక్కువ ఉంటే 50% సబ్సిడీ వస్తుంది. ఎటువంటి హామీ పెట్టాల్సిన పనిలేదు. టెన్యూర్ 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాంకు కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Advertisement

Udyogini Scheme Details In Telugu – Complete Details About Udyogini Scheme

బ్యాంకు లోన్ ఇచ్చినందుకు తగిన చార్జీలు వేస్తారు. ఈ లోన్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. 25 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలకు ఇది వర్తిస్తుంది. అలాగే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి. ఈ లోన్ కి అప్లై చేసినవాళ్లు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తీసుకుంటేనే లోన్ అందిస్తారు. ఇవన్నీ అర్హతలు ఉంటేనే బ్యాంకు లోన్ వస్తుంది. ఈ పథకానికి అప్లై చేయడానికి రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అలాగే బ్యాంక్ పాస్ బుక్ చూపించాలి.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి