
what happened to uttam kumar reddy
Uttam Kumar Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ.. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా ఆయన చేసింది కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ పార్టీ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీతో గెలుస్తుందట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే.. తాను చెప్పిన ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా కూడా తాను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా అని శపథం చేశారు. నిజానికి.. ఇదివరకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ పోటీ చేసి గెలిచిన వారే. అందుకే.. ఆయన అలా ప్రకటించి ఉంటారా అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
uttam kumar reddy challenge to congress party
ఉత్తమ్ చెప్పినట్టు కాకుండా కోదాడ, హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను నిజంగానే రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు, వాగ్దానాలు సర్వసాధారణమే కానీ.. వీటిని ఏ రాజకీయ నేత పాటించరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సవాళ్లు, హామీలు లాంటివి కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరి గోల వారిది అంటున్నారు. ఇవన్నీ కేవలం ఓట్ల కోసం పడే పాట్లు అంటున్నారు. ప్రస్తుతం నల్గొండకు ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చెప్పినట్టుగా కోదాడ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందా వేచి చూడాల్సిందే.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.