
Viral News : ఆమెను 13 సంవత్సరాలుగా శకటంలా వెంబడిస్తున్న అంబులెన్స్... చివరికి అదే...!
Viral News : అంబులెన్స్ అంటే ప్రాణాలను కాపాడే వైద్య వాహనం అన్న విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గుర్తుచేది అంబులెన్స్.. ఎవరికైనా ప్రమాదం జరగగానే 108 కి డయల్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వాహనం ఎంతో మంది ప్రాణాలను రక్షించింది. చావు నుంచి తప్పించి ఎన్నో కుటుంబాలు వెలుగును నింపింది. అలాగే ప్రసవాలు కూడా చేసి తల్లి బిడ్డలను కాపాడింది. ఇలా చాలామంది జీవితాలలో సెకండ్ లైప్ ఇచ్చిన అంబులెన్స్ ఒక మహిళ విషయంలో మాత్రం 13 సంవత్సరాలు నుండి ఆమెను శకటంలా వెంటాడుతూనే ఉంది.
ఇక చివరికి అదే అంబులెన్స్ ఆమె ప్రాణాలు తీసింది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన వరంగల్ జిల్లాలో ఇదే సంఘటన జరిగింది. 2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ 108 వాహనాలను ప్రారంభించిన కొత్తలో దాంట్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఈఎంటిగా జాయిన్ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల కు చెందిన సిద్ది మల్ల స్వప్న. ఈమె విధుల్లో చురుగ్గా ఉండటంతో స్వప్నకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి. అంబులెన్స్ వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు బద్దలు కొట్టింది. అయితే 2010లో అంబులెన్స్ వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద నిధులు నిర్వహిస్తుండగా.. ప్రమాదం జరిగిందన్న సమాచారంతో ఘటన స్థలానికి వాహనంతో పాటు బయలుదేరింది బృందం. ఆ టైంలో హాసనరి రోడ్లో అంబులెన్స్ వాహనానికి ప్రమాదం జరగడంతో స్వప్నకు త్రీవ్ర గాయాలు అయ్యాయి.
స్వప్నను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ కూడా జరిగింది. స్వప్న పూర్తిగా కోలు కోల్పోయినప్పటికీ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యానికి ఖర్చుని దృష్టిలో ఉంచుకొని మళ్లీ విధుల్లో జాయిన్ అయింది. కరోనా టైం లో కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేసింది. స్వప్న ఇక అంతలో మరో ప్రమాదం 2021 లో పరకాలలో అంబులెన్స్ వాహంలో పనిచేస్తున్న స్వప్న ఓ క్షతగాత్రున్ని ఎంజీఎం కు అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. అప్పుడు మళ్లీ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ వాహనం స్వప్న మరోసారి ఆస్పత్రిపాలైంది. ఇక అప్పటినుంచి ఆమె మంచానికి పరిమితం అయిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారటంతో సాటి ఉద్యోగులు కొంత డబ్బు సహాయం అందించారు. దాంతో తాను పనిచేసిన అదే వాహనంలో హైదరాబాదుకి ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ వైద్యులు ఎంతో ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక స్వప్న ఆదివారం నాడు మరణించింది. ఎన్నో ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ స్వప్న ప్రాణాలు తీసింది..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.