
ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
YCP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే. ఒకసారి జగన్ కు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి రెండోసారి కూడా ఇస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. అసలే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కరోనా ఆ తర్వాత వరదలు, వర్షాలు. అసలు పాలనకు సమయం ఎక్కడిది. అయినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారు. అయినప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఎంతోకొంత భయం దాక్కున్నది. కానీ.. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా పెరిగిందట. గత ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు 49.7 శాతంగా ఉంది. కానీ.. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందట. వైసీపీకి మద్దతు కూడా పెరిగినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. దీంతో ఏపీలోనే అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. అధికారంలో ఉన్న టీడీపీని ఘోరంగా ఓడించింది.
అయితే.. రెండో సారి కూడా ఏపీ ప్రజలు వైసీపీనే గెలిపించబోతున్నారని.. వైసీపీ ఓటు బ్యాంకు 49.7 శాతం నుంచి 58 శాతం వరకు పెరిగిందని అంటున్నారు. ఈ మాత్రం ఓటు బ్యాంకుతో రెండో సారి ఏపీలో గెలవడం కష్టమేమీ కాదంటున్నారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక, బద్వేలు, నెల్లూరు ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఆ ఎన్నికల్లో విజయం ఆధారంగా వైసీపీకి ఓటు బ్యాంకు పెరిగిందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు.. 175 సాధించాలని, 25 ఎంపీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలు సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
vote bank of ycp increased in ap
అంటే.. ఏపీలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనేదే వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రతి వైసీపీ నేత.. గడప గడప కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలు ఓటు బ్యాంకును పెంచాయని చెబుతున్నా.. మరోవైపు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని వైసీపీ నాయకులకు అర్థం అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. లేక అనుకూలత పెరిగిందా అనే విషయం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
Varalaxmi Sarathkumar S Saraswathi Movie Review : నటీనటులు: వరలక్ష్మి శరత్కుమార్, ప్రకాష్ రాజ్, జీవా, ప్రియమణి, రాధిక…
Russia oil : ఇరాన్ నేపథ్యంలో ఏర్పడిన యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ…
Donkey Farming : కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి పశుసంవర్ధక రంగంలో మరో ఆసక్తికరమైన అవకాశం కనిపిస్తోంది. సంప్రదాయ…
This website uses cookies.