Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Authored By Sam C | The Telugu News | Updated on : 8 November 2025, 8:02 am

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం (Triphala Powder) ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఔషధ మిశ్రమంగా పరిగణించబడుతుంది. ఇది మూడు పండ్లతో — ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ — తయారవుతుంది. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసే శక్తి త్రిఫలలో ఉంది.

ఇప్పుడు నిపుణులు చెబుతున్నట్లుగా, త్రిఫల పొడిని పాలతో కలిపి తీసుకోవడం శీతాకాలంలో మరింత ప్రయోజనకరమని అంటున్నారు. ఎలా అంటే

#image_title

త్రిఫల చూర్ణం ప్రత్యేకత

త్రిఫల అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగిన సహజ ఔషధం. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచి శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.

పాలతో కలిపి త్రిఫల తీసుకుంటే ప్రయోజనాలు

శీతాకాలంలో గోరువెచ్చని పాలలో త్రిఫల పొడిని కలిపి తాగితే:

శరీరానికి వేడి, శక్తి అందిస్తుంది

చర్మం, జుట్టుకు సహజ కాంతి తెస్తుంది

మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

శరీరంలోని విషాలను తొలగిస్తుంది

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

ఆయుర్వేద నిపుణుల ప్రకారం, త్రిఫల పాలతో తీసుకోవడం అజీర్తి, అలసట, చలికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

Advertisement

Also read

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి