ys jagan to discuss on groups war in ysrcp party
YS Jagan : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ వెళ్తున్నారు. ప్రజల కోసం ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు రాష్ట్రానికి ఏం అవసరమో అది ఆలోచించలేకపోయారు అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. 2014 లో ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఏం బాగోలేదు. ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. చివరకు సరైన రాజధాని కూడా లేదు.
ప్రజల బాగోగులతో పాటు..రాష్ట్రానికి పెట్టుబడులను కూడా తీసుకురావాలి. కానీ.. చాలా కంపెనీలు రాలేదు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తికాలేదు. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు రాజధానుల విషయం, ఇంకోవైపు ఉన్న సంస్థల పేర్లు మార్చడం.. ఇలా పలు రకాల విషయాలపై ఎందుకో వైసీపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందేమో అని ఆరోపణలు వస్తున్నాయి. అసలు.. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న యూనివర్సిటీని ఎందుకు మార్చాలి. ఈ సమయంలో దానికి వైఎస్సార్ అనే పేరు పెడితే రాష్ట్రానికి ఒరిగేదేంటి. ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో యూనివర్సిటీ పేరు మారుస్తూ బిల్లును తీసుకురావడం ఎందుకు. అది ఇప్పుడు అంత అవసరమా? అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
who is behind the decision of changing name of ntr health university
కొందరు వైసీపీ నేతలకే యూనివర్సిటీ పేరు మార్చే విషయం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని జగన్ ముందే ఎందుకు ఊహించలేదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు అసలు ఎవరు సలహాలు ఇస్తారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకోరా? ఇవి జగన్ సొంత నిర్ణయాలు కాకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి నిర్ణయాల వెనుక ఎవరు ఉన్నా జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కాస్తో కూస్తో ఆలోచించి ముందడుగు వేయాలని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.