Ys jagan : ఇంత సడెన్ గా సీఎం జగన్.. అమిత్ షాను కలవడం వెనుక అసలు కారణం ఏంటి?
Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీకి వెళ్లేంతవరకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ఎవ్వరికీ తెలియదు. అంత సడెన్ గా ఆయన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. గత నెలలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అనే దానిపై చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రతిపక్షాలైతే దాన్ని కూడా రాద్ధాంతం చేశాయి. […]
Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీకి వెళ్లేంతవరకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ఎవ్వరికీ తెలియదు. అంత సడెన్ గా ఆయన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. గత నెలలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అనే దానిపై చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రతిపక్షాలైతే దాన్ని కూడా రాద్ధాంతం చేశాయి.
మంగళవారం రాత్రి సీఎం జగన్.. అమిత్ షాతో సుమారు గంటన్నర దాకా భేటీ అయ్యారు. వీళ్ల మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ఇద్దరూ చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారు.
మూడు రాజధానుల అంశం కూడా చర్చకు వైఎస్ జగన్ వెళ్లింది..?
అలాగే.. ఏపీలో మూడు రాజధానుల అంశం గురించి కూడా సీఎం జగన్.. అమిత్ షాతో చర్చించారు. రాజధాని వికేంద్రీకరణ. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై రీ నోటిఫికేషన్ జారీ చేయాలని.. దానికి ఆమోదం తెలపాలని జగన్ ఈసందర్భంగా కోరారు.
అలాగే.. ఆర్సీసీ సిఫారుసు మేరకు పోలవరం వ్యయాన్ని 55,656 కోట్ల రూపాయలుగా ఆమోదించాలంటూ అమిత్ షాను జగన్ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు, ఏపీ విద్యుత్ రంగానికి కేంద్ర నుంచి రావాల్సిన సహాయం, ఇతర బకాయిల గురించి సీఎం జగన్.. అమిత్ షాతో చర్చించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ ఈ రోజు సాయంత్రం సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆర్సీసీ సిఫార్సు మేరకు పోలవరం వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదించాలని, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.(1/2) pic.twitter.com/6WxR5I0ZmC
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2021
వీటితో పాటుగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం వైయస్ జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.ఏపీకి ప్రత్యేక హోదా,కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు, ఏపీ విద్యుత్ రంగానికి కేంద్రం నుండి సహకారం, తదితర అంశాలపై చర్చించారు.(2/2)
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2021