YS Jagan : ఆ మూడు నియోజకవర్గాల మీద సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఆ మూడు నియోజకవర్గాల మీద సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. !

YS Jagan : సులభంగా గెలిచే నియోజకవర్గాలపై ఎక్కువగా ఎవ్వరూ దృష్టి పెట్టరు. కానీ.. కష్టతరమైన నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఎక్కడ గెలుపు అసాధ్యమూ.. ఎక్కడ గెలవడం కష్టమో అక్కడే ఫోకస్ పెడుతుంది. అక్కడే దృష్టి పెడుతుంది. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే పని చేస్తున్నారు. గెలుపు కష్టతరంగా ఉన్న ఆ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మీద సీఎం జగన్ ఫోకస్ పెంచారు. ఏపీలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 December 2022,9:40 pm

YS Jagan : సులభంగా గెలిచే నియోజకవర్గాలపై ఎక్కువగా ఎవ్వరూ దృష్టి పెట్టరు. కానీ.. కష్టతరమైన నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఎక్కడ గెలుపు అసాధ్యమూ.. ఎక్కడ గెలవడం కష్టమో అక్కడే ఫోకస్ పెడుతుంది. అక్కడే దృష్టి పెడుతుంది. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే పని చేస్తున్నారు. గెలుపు కష్టతరంగా ఉన్న ఆ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మీద సీఎం జగన్ ఫోకస్ పెంచారు. ఏపీలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అందులో 2019 ఎన్నికల్లో వైసీపీ 22 నియోజకవర్గాల్లో గెలిచింది. మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అవి విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అది కూడా కొద్ది తేడాతోనే. నిజానికి.. అక్కడ ఇంకాస్త కష్టపడి ఉంటే వైసీపీ ఆ నియోజకవర్గాల్లోనూ గెలిచేది. కేవలం 10 వేల లోపు మెజారిటీతోనే అక్కడ వైసీపీ ఓడిపోయింది. అయితే.. 2014 లోనూ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి మాత్రం ఎలాగైనా ఆ మూడు నియోజకవర్గాలను గెలవాలన్న కసిలో సీఎం జగన్ ఉన్నారు.

why ys jagan targeted three parliamentary constituencies

why ys jagan targeted three parliamentary constituencies

YS Jagan : జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఈ మూడు నియోజకవర్గాలు అన్నీ టీడీపీ కంచుకోటలేమీ కాదు. వీటిలో శ్రీకాకుళంలో మాత్రం టీడీపీ ఏడు సార్లు గెలిచింది. ఎర్రన్నాయుడు తర్వాత ఆ నియోజకవర్గాన్ని రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి అలా కాకుండి ఆయా నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. మరి.. వైఎస్ జగన్ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయా? ఒకవేళ ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిస్తే అప్పుడు మొత్తం 25 నియోజకవర్గాలు వైసీపీ వశం అవుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది