ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కానీ.. దాని గురించి జరుగుతున్న చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ.. వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే వీలే ఉండదు.
అయితే.. తమకే అన్ని తెలుసు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈసీ ఎన్నికల గురించి చెప్పకముందు వాళ్లే చెప్పేస్తున్నారు. ఎన్నికల డేట్ ను కూడా ఫిక్స్ చేసేస్తున్నారు.
ఓవైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని చెబితే… వైసీపీ నేతలు మాత్రం ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పార్టీ అనుకుంటోంది.. అంటూ పెద్ద బాంబు పేల్చారు.
అంటే ఆయన ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి.. అని చెప్పడానికి పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వచ్చే మార్చిలో రిటైర్ కాబోతున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత… వేరే వాళ్లు ఈసీగా నియమితులవుతారు. అప్పుడు తాము అనుకున్నట్టుగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చనేది వైసీపీ ప్లాన్.
ఎలాగూ అప్పటి వరకు కరోనా పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయి. తిరుపతి ఉపఎన్నిక కూడా అప్పటిలోపు పూర్తయిపోతుంది.. అన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలే ఈసీ కన్నా ముందు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో ఫిక్సయిపోతున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.