YCP : వైసీపీ అధినేత జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిస్తే ఇక 30 సంవత్సరాలు పాటు తిరుగుండదని నేతలకు ప్రతి సమావేశంలో తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో నాయకులు ఎక్కువగా ప్రజలలో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యధిక ఎన్నికలు వైసీపీ పార్టీ అలవోకగా గెలవడం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులలో సంతోషం నెలకొంది.
దాదాపు పది లక్షలకు పైగా ఓటర్లు 9 జిల్లాలలో 108 నియోజకవర్గాలలో విస్తరించిన వాళ్లు టీడీపీకే పట్టం కట్టడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. విషయంలోకి వెళ్తే నిన్న మొన్నటి వరకు గ్రామ…వార్డు సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ల వ్యవస్థ పై ఆధారపడ్డ వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఈ కోటాలో ఉన్న
ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఏడు స్థానాలు దక్కించుకొని మునుపటి మాదిరిగా సత్తా చాటాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి… బాధ్యతను కొంతమంది సీనియర్ నేతలకు జగన్ అప్పగించారట. దీంతో సదరు మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి… నియోజకవర్గ సమస్యలు ఇంకా నిధులు ఏం కావాలంటే విషయాలపై ఆరా తీయటం మాత్రమే కాదు ఆఫర్లు కూడా ఇస్తున్నారట. ఈ రకంగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే విధంగా వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.