YS Jagan : “జగనన్న కోసం పెళ్లి చేసుకోలేదు” ఈ మాట అన్న లేడీ ఎవరో కాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : “జగనన్న కోసం పెళ్లి చేసుకోలేదు” ఈ మాట అన్న లేడీ ఎవరో కాదు..!

YS Jagan : సినిమా సెలబ్రిటీలకు ఎలా ఫ్యాన్స్ ఉంటారో రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందులో విచిత్రం ఏం లేదు. అయితే.. ఒక్కొక్కరు తమ అభిమాన వ్యక్తి మీద రకరకాలుగా ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద ఓ మహిళ చూపిస్తున్న అభిమానాన్ని చూస్తే తట్టుకోలేం. ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. రాయలసీమ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ముస్లీం యువతి అప్పట్లోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2022,4:20 pm

YS Jagan : సినిమా సెలబ్రిటీలకు ఎలా ఫ్యాన్స్ ఉంటారో రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందులో విచిత్రం ఏం లేదు. అయితే.. ఒక్కొక్కరు తమ అభిమాన వ్యక్తి మీద రకరకాలుగా ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద ఓ మహిళ చూపిస్తున్న అభిమానాన్ని చూస్తే తట్టుకోలేం. ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. రాయలసీమ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ముస్లీం యువతి అప్పట్లోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసిందట. జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా?

అని చాలా మంది వెయిట్ చేశారు. వైసీపీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. చివరకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే మూడున్నరేళ్ల పదవీ కాలం కూడా అయిపోయింది. ఆయన గెలుపు కోసం ఎదురు చూసిన వాళ్లే కాదు.. ఆయన గెలుపు అహర్నిశలు కష్టపడ్డవారు కూడా ఉన్నారు. అందులో ఒకరు కర్నూలుకు చెందిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమీలా బేగం. నాకు జగనన్న అంటే పిచ్చి అభిమానం. ఆయనను సీఎంగా చూడాలనేదే నా కోరిక. అందుకోసం నేను వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం దాదాపు 12 ఏళ్ల పాటు కష్టపడ్డాను. పనిచేశాను.

ycp woman leader sacrificed her personal life for cm jagan

ycp woman leader sacrificed her personal life for cm jagan

YS Jagan : 12 ఏళ్లుగా వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం పని చేశా

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరుపున ఎన్నో నిరాహార దీక్షలు చేశాను. లాఠీల దెబ్బలు తిన్నాను. కానీ.. జగనన్న అధికారంలోకి వచ్చాక.. నాలాంటి చాలామంది కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఆయన్ను కలిసే అవకాశం కూడా తమకు ఇవ్వడం లేదు.. అంటూ జమిలా బేగం చెప్పుకొచ్చారు. చివరకు సీఎం జగన్ ను కలుసుకొని తమ బాధలు చెప్పుకోవాలని అనుకున్నా.. ఆయన్ను కలవనీయడం లేదంటూ ఆమె వాపోయారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. మరి.. ఈ విషయం చివరకు జగనన్నకు తెలిసి అయినా ఆ మహిళను కలుస్తారో? లేదో కాలమే సమాధానం చెప్పాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది