Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
Young Man : ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఒక విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దౌలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల అశోక్ అనే యువకుడు మద్యం తాగిన అనంతరం ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పామును చూసి ఆ పామును నోటిలో పెట్టుకొని కొరికి తినేశాడు. మత్తులో ఉన్న అతను ఏమాత్రం ఆలోచించకుండా ఈ దారుణనైకి ఒడిగట్టాడు. ఇది చూసిన అతని తల్లి భయంతో కేకలు వేయగా, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వెంటనే అతన్ని అడ్డుకున్నారు.
Young Man : మద్యం మత్తులో పామును కొరికి తినేసిన యువకుడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే !!
కుటుంబ సభ్యులు ముందుగా అతనికి నీళ్లు తాగించడంతో పాటు నోటిలో ఉన్న పాము ముక్కలను తీసేశారు. అనంతరం అతన్ని బాబేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించారు. పాము విషపూరితమైనది కాకపోవడం వల్ల అతని ప్రాణాలకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గ్రామంలో చర్చనీయాంశంగా మారిన ఘటన ఈ విచిత్ర ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాము పట్ల భయంతో ఉంటే తప్ప దాన్ని తినాలన్న ఆలోచన సాధారణంగా ఎవరికి వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మద్యం మత్తు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ సంఘటన మరోసారి నొక్కి చెబుతోంది. ప్రస్తుతం అశోక్ వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…
Cauliflower |కాలీఫ్లవర్ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
This website uses cookies.