YS Jagan : ఏపీకి మూడు రాజధానులు అనే అంశాన్ని సీఎం జగన్ లేవనెత్తిందే రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాలని. దాన్నే అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ.. ఒక్క అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉంటే జరగదని సీఎం జగన్ భావించి.. పరిపాలన రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ధి జరిగేలా వైజాగ్ లో ఏర్పాటు చేయాలని, న్యాయ రాజధాని అంటే హైకోర్టు కర్నూలులో ఉండేలా చేసి రాయలసీమ అభివృద్ది జరగేలా చేయాలని భావించారు. ఎలాగూ శాసనసభ అమరావతిలో ఉంది కాబట్టి.. దాన్ని అలాగే శాసన రాజధానిగా చేయాలని సీఎం జగన్ భావించారు.
కానీ… మూడు రాజధానుల అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. హైకోర్టు మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు కర్నూలుకు ఎలాగైనా హైకోర్టు ఇవ్వాల్సిందే అనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైకోర్టు సాధన సమితి, రాయలసీమ సంఘాలు అనే గ్రూపులు ఏర్పడి నిరసన తెలుపుతున్నాయి. తొలి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ వాసులు వాదిస్తున్నారు. న్యాయ రాజధాని విషయంలో రాయలసీమలో ఇంత ఉద్యమం నడుస్తుంటే వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మాత్రం ఎలాంటి నిరసన వ్యక్తం కావడం లేదు.
కేవలం అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఇతర నేతలు మాత్రమే వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని అంటున్నారు. సీఎం జగన్ కూడా తాజాగా అసెంబ్లీ వేదికగా త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన ప్రారంభం కాబోతోందని చెప్పారు. సుప్రీం కోర్టులోనూ మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ.. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఎందుకో వైసీపీ ప్రభుత్వం చేసే పనులపై ఎలాంటి డిమాండ్లు చేయడం లేదు. ఇది ఒకరకంగా ప్రభుత్వానికే అంతుచిక్కడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వైసీపీ పార్టీకి, ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర విషయంలో సీఎం జగన్ వైఖరి ఎలా ఉంటుందో?
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.