
Early Polls, PK Suggession For KCR & Jagan
YS Jagan : తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే డిసెంబర్ నుండి వార్డు, గ్రామ సచివాలయాలను తాను పర్సనల్ గా సందర్శిస్తానని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన జగన్ డిసెంబర్ నుండి రెగ్యులర్ గా తాను సందర్శించడమే కాక జిల్లా అదికారులను సందర్శించాలని ఆదేశించారు. అలాగే నెలకు 4 సచివాలయాల్ని సందర్శించి, అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్నిబట్టి జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రిపేర్ అయిపోతున్నారన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఈ సందర్శన పేరిట ఎమ్మెల్యేలు సైతం జనాల్లోకి చొచ్చుకుపోవాలని ఆదేశించినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయన్న మాట జనాల్లోకి బాగా వెళ్లింది.. తమకు ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరుల బాధ తప్పిందన్న హ్యాపీనెస్ ప్రజల్లోనూ వ్యక్తమమవుతోంది. దీన్ని ఓట్లుగా మార్చుకునే పనిలో ఇప్పుడు జగన్ దిగారన్న ఆలోచన సర్వత్రా వినిపిస్తోంది.
Ys jagan following on kcr
ఇక వచ్చే ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్న ఎమ్మెల్యేలు .. ఇప్పటి నుంచి సచివాలయ వ్యవస్థను ఫాలో చేస్తే, అక్కడ ఉన్న చిన్నా చితకా సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చని, దీనివల్ల మరింత పేరు తెచ్చుకోవచ్చని సీఎం జగన్ ప్లాన్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి పని లేకుండా పోయిన ఎమ్మెల్యేలకు చేతినిండా పని మాత్రమే కల్పించి, ఎన్నికల్లో పనికివస్తారో లేదో తేల్చుకోవాలన్నది కూడా వైఎస్ జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు వస్తారంటే, వారితో పాటు కచ్చితంగా అధికారులు కూడా దిగాల్సి ఉంటుంది.. ఇక తనతో సంబంధం లేకుండానే కలెక్టర్లు, ఎస్పీలు, జాయిట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవో అందరినీ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారంటేనే కారణం అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలవటానికి వైఎస్ జగన్ దగ్గరున్న తురుపుముక్కల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధ కూడా ఒకటి.
Ys jagan following on kcr
Ys jagan following on kcr
వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న నవరత్నాల పథకాల అమలు విషయంలో వాలంటీర్లదే కీలకమైన పాత్ర. వీళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఈమధ్య జరిగిన క్యాబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే నిజమైతే డిసెంబర్ నుండి సచివాలయాలను వ్యక్తిగతంగా సందర్శించటం వ్యూహాత్మకమనే చెప్పాలి. మరోవైపు పీకే టీం కూడా తెరంగేట్రం చేయనుందన్న వార్తల దరిమిలా .. అన్నీ కలిసివస్తే, వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్నది ఓ అంచనా గా విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా విపక్షాలకు చెక్ చెప్పవచ్చని, సచివాలయ సందర్శనతో ఎమ్మెల్యేలు కూడా పనిలోకి దిగుతుండడంతో, గెలుపు సులువు అవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నారట.
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
This website uses cookies.