
ys jagan mohan reddy
Ys Jagan : ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు ఏమీ రాలేదు అనేది విపక్ష పార్టీల ఆరోపణలు. కొన్ని కారణాల వల్ల ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు రాని మాట వాస్తవమే. కాని ఇకపై వరుసగా ఏపీలో పెట్టుబడులు వస్తాయని వైకాపా నాయకులు మరియు మంత్రులు అంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో కొత్తగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్స్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ఏపీలో ఉన్న పరిస్థతుల కారణంగా 2019 తర్వాత వారు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే వారి కోసం పన్ను రాయితీని కూడా జగన్ ప్రకటించారు అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కొత్త పాలసీని ప్రవేశ పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. త్వరలో శాసన సభ సమావేశాల్లో ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాలసీల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు.
ys jagan mohan reddy
దాంతో విదేశీయుల కు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారట. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడులు లేక పోవడం వల్ల ఉద్యోగాలు లేవు మరియు ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పాలసీలను తీసుకు వచ్చి విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పేట్ ను పర్చబోతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది మరియు అమలు అవుతున్న పథకాల కారణంగా పెట్టుబడులకు స్వర్ఘ దామంగా రాష్ట్రం నిలిచిందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారుల కొత్త పారిశ్రామకి పాలసీలను తయారు చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.