
ys jagan mohan reddy
Ys Jagan : ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు ఏమీ రాలేదు అనేది విపక్ష పార్టీల ఆరోపణలు. కొన్ని కారణాల వల్ల ఏపీలో ఇటీవల కాలంలో పెట్టుబడులు రాని మాట వాస్తవమే. కాని ఇకపై వరుసగా ఏపీలో పెట్టుబడులు వస్తాయని వైకాపా నాయకులు మరియు మంత్రులు అంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో కొత్తగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్స్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ఏపీలో ఉన్న పరిస్థతుల కారణంగా 2019 తర్వాత వారు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే వారి కోసం పన్ను రాయితీని కూడా జగన్ ప్రకటించారు అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కొత్త పాలసీని ప్రవేశ పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. త్వరలో శాసన సభ సమావేశాల్లో ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాలసీల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు.
ys jagan mohan reddy
దాంతో విదేశీయుల కు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారట. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడులు లేక పోవడం వల్ల ఉద్యోగాలు లేవు మరియు ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పాలసీలను తీసుకు వచ్చి విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పేట్ ను పర్చబోతున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది మరియు అమలు అవుతున్న పథకాల కారణంగా పెట్టుబడులకు స్వర్ఘ దామంగా రాష్ట్రం నిలిచిందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారుల కొత్త పారిశ్రామకి పాలసీలను తయారు చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు.
Gold Rate Today : దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా…
Drumstick : మన వంటింట్లో తరచుగా కనిపించే మునగకాయలు రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం కూడా.…
Coffee : ఉదయం నిద్ర లేవగానే కాఫీ సువాసనతో రోజును ప్రారంభించడం చాలా మందికి ఒక ప్రత్యేకమైన అనుభూతి. కాఫీ…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంపై కొంతమేర ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈరోజు 12…
Tipparthi : నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు (ఆర్ అండ్…
12 Years Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ పాలనలో 12 సంవత్సరాల మైలురాయిని…
Bharathiraja Passes Away : దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అస్తమించింది. తమిళ చిత్రసీమకు గ్రామీణ కథల…
Viral Video : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయో చెప్పే మరో హృదయ విదారక…
Heavy Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…
Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
This website uses cookies.