Ys Jagan : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగింది. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సౌత్ లో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కాని ఇటీవల కేసుల సంఖ్య ఇక్కడ కూడా భారీగా పెరుగుతున్నాయి. దాంతో ఏపీలో వ్యాక్సినేషన్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ కు ఫుల్ డిమాండ్ ఉంది. కాని ఏపీలో వ్యాక్స్ నిల్వలు నిండుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా కేంద్రంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరుపుతూ చివరకు వ్యాక్సిన్ ను తెప్పించాడు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం 5 లక్షల డోసులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ అయిదు లక్షల డోసులను వెంటనే పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. కరోనా విజృంభించకుండా ఉండేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపధికన వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వినియోగించడం వల్ల కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అబిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేయడం ద్వారానే ఈ విపత్తు నుండి బయట పడవచ్చు అంటూ కేంద్రం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.
ఏపీలో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో 5 లక్షల మందికి వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నా కూడా కరోనా ప్రభావం నుండి కాస్త అయినా ఉపశమనం పొందవచ్చు అనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రాణాపాయం తప్పించడం లేదా వైరస్ ను దూరంగా ఉంచడంలో వ్యాక్సిన్ కీలకంగా పని చేస్తుంది. అందుకే అయిదు లక్షల డోసులు రావడం అనేది ఏపీ ప్రజలకు శుభవార్తే అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.