YS Jagan : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా అంతకుముందు పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎక్కువ స్థానాలు గెలిచిన గాని తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా పుంజుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకీ అనుకూలంగా ఓటు వేయడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో సదరు నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
అయినా గాని సొంత పార్టీ నేతలలో ప్రజాప్రతినిధులలో ఏమాత్రం సీరియస్నెస్ లేకపోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల జగన్ అంతర్గతంగా చాలా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులలో చాలామంది కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల కూడా అధినాయకుడు అసహనంగా ఉన్నారట. దీంతో క్యాబినెట్లో ఐదుగురు మంత్రులను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు టాక్. పైగా వాళ్లకు కేటాయించిన శాఖలో వాళ్ళ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడంతో… మంత్రివర్గ ప్రక్షాళన చేయటానికి
నిర్ణయం తీసుకున్నట్లు దీంతో త్వరలోనే గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల ప్లేసులోకి ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకోవడానికి జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టైం లో ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా వ్యవహరించారు. ఇక రెండోసారి.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో కొడాలి నానిని… పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఐదుగురు మంత్రులను పక్కన పెడుతున్న నేపథ్యంలో కొడాలి నాని తో పాటు పేర్ని నాని మరి కొంతమంది కౌంటర్లు ఇచ్చే పార్టీ వాయిస్.. తోపాటు ప్రభుత్వం చేసే మంచి పనులను తెలియజేసే వారికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు సమాచారం.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.