Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. మరి కొద్ది రోజులలో ఎన్నికలు రాబోతున్న వేళ తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో చెలరేగిపోతున్నారు. సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చంద్రబాబు నాయుడు నిజాస్వరూపాన్ని కళ్ళకు కట్టేలా మంచి చెడులు వివరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు లో నిర్వహించిన ‘ సిద్ధం ‘ మహాసభ జన సంద్రాన్ని తలపించింది. ముందు జరిగిన రెండు సభల కంటే ఈ మూడో సభ రెట్టింపు స్థాయిలో సక్సెస్ అయింది. యుద్ధానికి మీరు సిద్ధమా అని వైయస్ జగన్ ప్రశ్నించినప్పుడల్లా జనం పిడికిలి బిగించి సిద్ధమంటూ సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజానీకానికి జరిగిన మంచి గురించి వివరిస్తూ, మరోవైపు మూడు దశల్లో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన మార్క్ అంటూ ఫలానా అని చెప్పుకోలేని దుర్మార్గ పాలన సాగించారని విరుచుకుపడ్డారు.
జరగబోయే ఎన్నికల్లో ఎవరెవరి మధ్య అనే విషయాన్ని మేధావులకే కాదు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వైయస్ జగన్ వివరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని ఆయన వివరించారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి, పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని అడుగులు వేసే మనకు అటువైపు వద్దని అడ్డుకునే డ్రామాలాడుతున్న చంద్రబాబు నాయుడుకి మధ్య జరుగుతున్న యుద్ధంగా వైయస్ జగన్ అఅభివర్ణించారు. యుద్ధానికి మీరు సిద్ధమా అని వైయస్ జగన్ ప్రశ్నించడం జనం నుంచి సిద్ధమంటూ రెట్టించిన ఉత్సాహంతో రీసౌండ్ రావడం విశేషం.
యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందో వైయస్ జగన్ కవితాత్మకంగా చెప్పారు. పేదలు, పెద్దందారుల మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ మాట నిలబెట్టుకున్న మనకు అటువైపు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని వివరించారు. అలాగే విశ్వసనీయతకు, వంచనకు, నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ , ఇక్కడే ప్రజల మధ్య ఉండే మనకు యుద్ధం అంటూ జనంలో ఉత్సాహాన్ని నింపడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు వైయస్ జగన్ సవాలు విసిరారు. మీ పేరు చెబితే రైతులు, అక్క చెల్లెమ్మలకైనా, విద్యార్థులకైనా, అవ్వ తాతల కైనా ఇలా అన్ని వర్గాల ప్రజలకు గుర్తొచ్చే ఒక్క పథకమైన ఉందా అని నిలదీశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కనీసం 10% అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటు, మోసాలే అంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పై వైయస్ జగన్ విమర్శల తూటాలు పేల్చడంలో సక్సెస్ అయ్యారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.