YS Jagan : బద్వేలు ఉప ఎన్నిక ముగిసింది ఇక ఎన్నికల వాతావరణం కొద్ది రోజుల పాటు ఉండబోదు అనుకునేలోపే మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అయితే, ఈ నగారా అసెంబ్లీ ఎన్నికలది కాదు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీల కోసం జరిగే ఎన్నిక. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను అధికార వైసీపీ నుంచే ఎన్నికవుతారు.బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి, టీడీపీకి చెందిన షరీఫ్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి వారే ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు.
బద్వేలు ఉప ఎన్నిక పూర్తి అయిన నేపథ్యంలో ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా వైఎస్ జగన్ నామినేట్ చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. వైసీపీ నేత గోవిందరెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. .కాగా, సోమువీర్రాజు, షరీఫ్ స్థానాల్లో ఎవరిని నామినేట్ చేస్తారో అనేది కీలకంగా మారింది. సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాల దృష్ట్యా బాగా ఆలోచించి ఆల్రెడీ వైఎస్ జగన్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలల నుంచి తోట త్రిమూర్తులు, మోషేర్ రాజు పేర్లు వినబడుడుతున్నాయి. విశాఖ, గుంటూరు జిల్లాల నుంచి గోవిందరెడ్డి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
కాగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్కు అప్పట్లోనే జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ నేఫథ్యంలోనే ఈ సారైనా మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ అవుతారా అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విశాఖ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు వినబడుతోంది. అయితే, మూడు స్థానాలకుగాను మూడు సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.