YS Jagan : ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు వారేనట.. నిర్ణయం తీసుకున్న వైఎస్ జ‌గ‌న్‌..!

 Authored By mallesh | The Telugu News | Updated on :31 October 2021,7:00 pm

YS Jagan : బద్వేలు ఉప ఎన్నిక ముగిసింది ఇక ఎన్నికల వాతావరణం కొద్ది రోజుల పాటు ఉండబోదు అనుకునేలోపే మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అయితే, ఈ నగారా అసెంబ్లీ ఎన్నికలది కాదు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీల కోసం జరిగే ఎన్నిక. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను అధికార వైసీపీ నుంచే ఎన్నికవుతారు.బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్‌ సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి, టీడీపీకి చెందిన షరీఫ్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి వారే ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు.

Ys Jagan

Ys Jagan

బద్వేలు ఉప ఎన్నిక పూర్తి అయిన నేపథ్యంలో ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా వైఎస్ జ‌గ‌న్‌ నామినేట్ చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. వైసీపీ నేత గోవిందరెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. .కాగా, సోమువీర్రాజు, షరీఫ్ స్థానాల్లో ఎవరిని నామినేట్ చేస్తారో అనేది కీలకంగా మారింది. సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాల దృష్ట్యా బాగా ఆలోచించి ఆల్రెడీ వైఎస్ జ‌గ‌న్‌ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలల నుంచి తోట త్రిమూర్తులు, మోషేర్ రాజు పేర్లు వినబడుడుతున్నాయి. విశాఖ, గుంటూరు జిల్లాల నుంచి గోవిందరెడ్డి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ డెసిషన్ ఫైనల్..

Ysrcp

Ysrcp

కాగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు అప్పట్లోనే జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ నేఫథ్యంలోనే ఈ సారైనా మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ అవుతారా అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విశా‌ఖ నుంచి వంశీకృష‌్ణ శ్రీనివాస్‌ పేరు వినబడుతోంది. అయితే, మూడు స్థానాలకుగాను మూడు సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి