YS Jagan : రాష్ట్ర అభివృద్ది కోసం నరేంద్ర మోడీతో వైయస్ జగన్ గంట పాటు చర్చలు

YS Jagan : ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తో గంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. ఈ మేరకు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ముందుకు వెళ్లాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు మరియు జాతీయ ఆహార భద్రత చట్టం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

ప్రధాని తో జగన్ భేటీకి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి పనుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ జగన్ కోరారని, అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన క్లియరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అలాగే రాష్ట్రంలోని ఇతర ఎయిర్పోర్ట్ లకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా వెంటనే తీసుకోవాలంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం తో ఉన్న విభజన చట్టం విభేదాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

YS Jagan meeting with pm narendra modi

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు రాజకీయ డెవలప్మెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ చర్చించారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కూడా జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో విజ్ఞప్తుల అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే పలు సార్లు కేంద్రానికి విజ్ఞప్తి అందినా కూడా వారి నుండి స్పందన కరువైంది. మరి ఈసారైనా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విజ్ఞప్తులను పట్టించుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారా అంటూ వైకాపా నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Posts

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

31 minutes ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

16 hours ago